
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) గురువారం శ్రీవీరాంజనేయభజన మండలి, బనగానపల్లె మండలం, నంద్యాల జిల్లా వారు భజన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ భజన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఈశామహేశా, కైలాసవాస, శంకరా పార్వతీపరమేశ్వరా, ఓంకార రూపా, శ్రీశైలవాసా శ్రీమల్లికార్జున, గంగా తరంగ, శ్రీగౌరిపార్వతీ మొదలైన పలు భక్తిగీతాలు, అష్టకాలకు బి.వి. సూర్యనారాయణరెడ్డి, ఆర్.సి. నాగిరెడ్డి, బి. లక్ష్మీనారాయణరెడ్డి, డి. సీతారామిరెడ్డి, ఎం. రామకృష్ణ, బి. శివయ్య, మధుకుమార్, మహేశ్వరరెడ్డి, పద్మావతమ్మ, లక్ష్మీదేవి, తదితరులు ఆలపించారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతిరోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల రక్షణ భాగంగా ఈ నిత్య కళారాధన నిర్వహిస్తున్నారు