ఉగాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలి-ఈ ఓ

శ్రీశైల దేవస్థానం: ఉగాది ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ ఓ చెప్పారు. మార్చి 27 నుంచి 31 వరకు ఉగాది మహోత్సవాలు జరుగనున్నాయి.
ఈ మహోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై  సమావేశ భవనములో కార్యనిర్వహణాధికారి  సోమవారం  దేవస్థానం వివిధ శాఖాధిపతులు,
పర్యవేక్షకులతో సమావేశాన్ని నిర్వహించారు.
సమావేశంలో కార్యనిర్వహణాధికారి  మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలకు కర్ణాటక రాష్ట్రంలోని
పలు ప్రాంతాల నుండే కాకుండా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుండి ముఖ్యంగా షోలాపూర్, సాంగ్లీ
తదితర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని
కోణాల నుండి తగు జాగ్రత్తలు తీసుకుంటూ, ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేయవలసినదిగా సంబంధిత
అధికారులను ఆదేశించారు.
ముఖ్యంగా సిబ్బంది , క్షేత్రానికి విచ్చేసే భక్తులందరితో మర్యాదగా మెలగాలని, ప్రతీ
భక్తుడిని ఒక అతిథిగా భావించాలని సూచించారు.ఉగాది ఉత్సవాలు మార్చి 27వ తేదీన ప్రారంభమవుతున్నప్పటికీ వారం రోజులు ముందుగానే భక్తులు
క్షేత్రానికి చేరుకునే అవకాశం ఉందని చెబుతూ, ఈ నెల 20వ తేదీకంతా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి
చేయాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు.
ఉగాది ఏర్పాట్లపై ఈ నెల 1వ తేదీన జరిగిన సన్నాహక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను
అనుసరించి అన్ని విభాగాలు కూడా తగు కార్యాచరణ ప్రణాళికలతో ఆయా ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా ఉత్సవాలలో శ్రీస్వామి అమ్మవార్లకు జరిగే ఆయా కైంకర్యాలన్నీ ఎలాంటి లోపం లేకుండా
పరిపూర్ణంగా జరగాలని వైదిక సిబ్బందికి సూచించారు. అదేవిధంగా ఉత్సవ పూజాదికాలు అన్నీ కూడా
నిర్దేశించబడిన సమాయానికి ప్రారంభించాలని వైదిక సిబ్బందికి సూచించారు.
శ్రీస్వామిఅమ్మవార్ల దర్శనానంతరం భక్తులకు దాదాపు 12 లక్షల లడ్డు ప్రసాదాలను అందుబాటులో
ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని ప్రసాదాల తయారీ విభాగాన్ని ఆదేశించారు.
ఉత్సవాలకు కాలిబాట మార్గములో  వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు,
మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మీదుగా క్షేత్రానికి వస్తారని,  కాలిబాట మార్గములో తగిన
సదుపాయాలను కల్పించాలని సంబంధిత విభాగాలను ఆదేశించారు. అటవీశాఖ అధికారుల సమన్వయంతో
ఆయా ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలన్నారు.
ముఖ్యంగా కాలిబాటలో భక్తులకు మంచినీటిని అందించడములో ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాటు చేసినట్లుగానే కైలాసద్వారం వద్ద అదనపు మంచినీటి ట్యాంకులను
ఏర్పాటు చేయాలన్నారు.

కైలాసద్వారం, భీమునికొలను మార్గములో సింటెక్సు ట్యాంకులను నెలకొలిపి మంచినీటి
కుళాయిలను ఏర్పాటు చేయాలన్నారు.భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకొని అందుకు అనుగుణంగా నీటిసరఫరాకు అవసరమైన చర్యలు
చేపట్టేందుకు ప్రత్యేకమైన కార్యచరణ ప్రణాళికను రూపొందించి ఆ క్రమంలో చర్యలు తీసుకోవాలని
ఆదేశించారు.
మహాశివరాత్రిలో వేసిన  మంచినీటి కుళాయిలన్నింటిని కూడా ఉగాది ఉత్సవాలలో కూడా
వినియోగించుకునే విధంగా చర్యలు చేపట్టాలన్నారు.
ముఖ్యంగా సాక్షిగణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం మరియు కైలాద్వారంతో పాటు క్షేత్రంలో భక్తులు
బసచేసే పలు ప్రదేశాలకు ట్యాంకర్ల ద్వారా మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇంకా దర్శనం
క్యూలైన్లలో కూడా నిరంతరం మంచినీటి సరఫరా చేయాలన్నారు.
కాలిబాట మార్గంలోని నాగలూటి, పెచ్చెర్వు, కైలాసద్వారం మొదలైన చోట్ల మరియు శ్రీశైలక్షేత్ర
పరిధిలో పలుచోట్ల భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుండి అవసరమైన పూర్తి సహాయ
సహకారాలను అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఉత్సవాలలో క్షేత్రపరిధిలో కూడా
పలుచోట్ల భక్తులు అన్నదానం చేస్తుంటారని, అన్నదాన బృందాలన్నింటికి దేవస్థానం తరుపున ఆయా
ఏర్పాట్లను చేయాలని ఇంజనీరింగ్, అన్నప్రసాద వితరణ విభాగాలను ఆదేశించారు. ముఖ్యంగా
అన్నదాన ప్రాంతాలలో పైప్ పెండాల్స్, లైటింగు ఏర్పాటు, మంచినీటి సరఫరా ఏర్పాటు ఉండాలన్నారు.
క్యూలైన్లలో వేచివున్న భక్తులకు నిరంతర మంచినీరు, అల్పాహారాన్ని అందజేసే ఏర్పాట్లు చేయాలని
అన్నదాన, ఆలయ , క్యూల నిర్వహణ విభాగాలను కార్యనిర్వహణాధికారి ఆదేశించారు. ఎండతాకిడి
అధికంగా ఉన్నందున క్యూకాంప్లెక్సు మరియు క్యూలైన్లలో అవసరమైనచోట్ల కూలర్లను కూడా ఏర్పాటు
చేయాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు.
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో ఏర్పాట్లు చేసినట్లుగానే భక్తులు సేద తీరేందుకు ఉగాది
మహోత్సవాలలో కూడా పలు చోట్ల షామియానాలు, పైప్పెండాల్స్ ( చలువ పందిర్లు) మొదలైనవి ఏర్పాటు
చేయాలని ఆదేశించారు. వీలైనన్నీ ఎక్కువ ప్రదేశాలలో ఈ ఏర్పాట్లు ఉండాలన్నారు. చలువపందిర్లు
వేయబడిన అన్ని ప్రదేశాలలో కూడా తగినంత విద్యుద్దీకరణ ఏర్పాట్లు ఉండాలన్నారు. అదేవిధంగా మంచినీరు
కూడా అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
భక్తులరద్దీని దృష్టిలో ఉంచుకుని క్షేత్రపరిధిలోని పలు ఆరుబయలు ప్రదేశాలలో లైటింగ్ ఏర్పాట్లు
చేయాలన్నారు. దేవస్థానం అతిథిగృహాల ప్రాంగణం, ఉద్యానవనాలు, తాత్కాలిక వసతిప్రదేశాలు మొదలైన
చోట్ల వీలైనంత ఎక్కువ విస్తీర్ణంలో ఈ తాత్కాలిక లైటింగ్ను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను
ఆదేశించారు.
భక్తులకు సేవలను అందించేందుకు కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన స్వచ్ఛందసేవకుల
సహకారాన్ని తీసుకోవాలని ప్రజాసంబంధాల అధికారివారిని ఆదేశించారు.
ఆలయంలో స్వచ్ఛంద సేవలను అందించే సేవకులకు నిర్ణీత వేళలలో షిఫ్టులను నిర్ణయించి వీరికి
తదనుగుణంగా తాత్కాలిక గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు.

లక్షలాదిసంఖ్యలో భక్తులు వస్తున్న కారణంగా దేవస్థానం వైద్యశాలలో అవసరమైన మేరకు
ఔషధాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు.గుండెజబ్బులు మొదలైన వాటికి అత్యవసరమైన మందులు, కాలినడకన వచ్చే భక్తులకు బొబ్బల
నుండి ఉపశమనం కల్పించేందుకు పూతమందులు (ఆయింట్మెంట్మందు) మొదలైన వాటితో పాటు
అవసరమైన సూది మందులను కూడా సిద్ధంగా ఉంచుకోవాలని వైద్యవిభాగాన్ని ఆదేశించారు.
ముఖ్యంగా క్షేత్రపరిధిలోనూ మరియు కైలాసద్వారం మొదలైనచోట్ల జిల్లా వైద్యశాఖ సహకారముతో
తాత్కాలిక వైద్యశిబిరాలను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
పారిశుద్ధ్య నిర్వహణకుగాను మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో చేపట్టినట్లుగానే కార్యాచరణ ప్రణాళిక
రూపొందించి ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. పారిశుద్ధ్య పనులకు గాను దేవస్థానం పారిశుద్ధ్య
సిబ్బందితో పాటు అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పారిశుద్ధ్య విభాగపు సహాయ
కార్యనిర్వహణాధికారివారిని ఆదేశించారు.
ఎప్పటికప్పుడు _ చెత్తచెదారాలను తొలగించేందుకుగాను అవసరమైన సంఖ్యలో ట్రాక్టర్లను
అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
క్షేత్రపరిధిలో పలుచోట్ల  శాశ్వత మరుగుదొడ్లను భక్తులు వినియోగించుకునేందుకు వీలుగా
వాటిని అందుబాటులో ఉంచాలన్నారు. వీటితో పాటు పలుచోట్ల తాత్కాలిక మరుగుదొడ్లను కూడా ఏర్పాటు
చేయాలన్నారు.
అదేవిధంగా స్వచ్ఛ శ్రీశైలంలో భాగంగా క్షేత్రపరిధిలో బహిరంగ మలమూత్రవిసర్జనను నిషేధించిన
విషయమై సూచికబోర్డుల ద్వారా భక్తులకు అవగాహన కల్పించాలన్నారు.
భక్తులకు సమాచారాన్ని తెలియజేసేందుకు అవసరమైన అన్ని చోట్ల కూడా కన్నడభాషలో విస్తృతంగా
సూచికబోర్డులను ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ మరియు శ్రీశైలప్రభ విభాగాన్ని ఆదేశించారు.
మహాశివరాత్రికి ఏర్పాటు చేసినట్లుగానే భక్తుల సౌకర్యార్థం అవసరమైన మేరకు ఉచిత బస్సులను
ఏర్పాటు చేయాలన్నారు.
ఉత్సవాలలో భక్తులను అలరించేందుకు కన్నడ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.
కన్నడ భక్తి సంగీత విభావరి కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు కన్నడ ప్రవచనాలు, కన్నడ
భక్తినాటకాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రజాసంబంధాల అధికారి ని ఆదేశించారు.
ఉత్సవాలలో భక్తుల సౌకర్యార్థమై నందిసర్కిల్, కల్యాణకట్ట, పాతాళగంగమెట్లమార్గం, సాక్షిగణపతి,
హేమారెడ్డి మల్లమ్మ మందిరం, సెంట్రల్ పార్కింగ్, దేవస్థానం వైద్యశాల మొదలైన చోట్ల తాత్కాలిక సమాచార
కేంద్రాలను ఏర్పాటు చేసి అందులో సిబ్బందిని నిరంతరం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఈ
సమాచార కేంద్రాలలో కన్నడ ప్రాంతాల స్వచ్ఛంద సేవకులను ఏర్పాటు చేసుకుని వారి సహకారంతో భక్తులకు
తగు సమాచారాన్ని అందజేయాలన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.