×

పరోక్షసేవగా శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన

పరోక్షసేవగా శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన

శ్రీశైల దేవస్థానం:శ్రీశైలక్షేత్రపాలకుడైన శ్రీబయలు వీరభద్రస్వామి వారికి విశేషార్చన జరిగింది.

ప్రతీ మంగళవారం, అమావాస్య రోజులలో ఈ విశేషార్చనను జరుగుతోంది.

 అమావాస్య రోజున భక్తులు  పరోక్షసేవగా ఈ అర్చనను జరిపించుకునే అవకాశం కల్పించారు.

ఈ రోజు పరోక్షసేవ ద్వారా మొత్తం 47 మంది భక్తులు ఈ విశేషపూజలను జరిపించుకున్నారు.

ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా, ఒడిస్సా, కర్ణాటక, తమిళనాడు, మొదలైన ఇతర రాష్ట్రాల వారు కూడా ఈ పూజలను జరిపించుకుంటున్నారు.

 ఈ పూజాదికాల కార్యక్రమం నిర్విఘ్నంగా జరిగేందుకు ముందుగా మహాగణపతిపూజను జరిపారు.

 పూజాదికాలలో పంచామృతాలతోనూ, బిల్వోదకం, కుంకుమోదకం, హరిద్రోదకం, భస్మోదకం, గంధోదకం, పుష్పోదకం, శుద్ధజలాలతో వీరభద్రస్వామివారికి అభిషేకం జరిగింది.

ఈ స్వామి ఆరాధన వలన గ్రహదోషాలు నివారించబడుతాయని, అరిష్టాలన్నీ తొలగి పోతాయని, ఎంతటి క్లిష్ట సమస్యలైనా పరిష్కరించబడతాయని, ప్రమాదాలు నివారించ బడతాయని, సర్వకార్యానుకూలత లభిస్తుందని, అభీష్టాలు సిద్ధిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.

ఈ పరోక్షసేవకు భక్తులు ఆన్లైన్ ద్వారా రూ.1,116/-లను సేవారుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు సేవారుసుమును www.srisailadevasthanam.org లేదా aptemples.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు.

 ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతున్నామని దేవస్థానం పేర్కొంది.సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి | యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.భక్తులందరు  ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.ఇతర వివరాలకు  దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/52 /53/ 54/55/56 లను సంప్రదించవచ్చును.

print

Post Comment

You May Have Missed