
శ్రీశైలం – నంద్యాల: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ సుప్రసిద్ధ శైవక్షేత్రమైన శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల దర్శనార్థం సోమవారం సాయంత్రం 5-10 గంటలకు సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకున్నారు,
రాష్ట్ర గవర్నర్ కు ఘనంగా స్వాగతం పలికిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ , రోడ్డు భవనాలు, పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి , శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి , జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా , కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్.