
శ్రీశైల దేవస్థానం:ఈ సంవత్సరం శ్రీశైల దేవస్థానం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు 01.03.2024 నుండి 11.03.2024 వరకు 11 రోజులపాటు నిర్వహిస్తారు.
1వ తేదీ ఉదయం 8.46 గంటలకు యాగశాల ప్రవేశముతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
11వ తేదీన రాత్రి జరిపే పుష్పోత్సవ, శయనోత్సవాలతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.
ముఖ్య కార్యక్రమాలు :
01.03.2024 – ధ్వజారోహణ,
02.03.2024 -భృంగివాహనసేవ,
03.03.2024 – హంసవాహనసేవ,
04.03.2024- మయూరవాహనసేవ,
05.03.2024 – రావణవాహనసేవ
06.03.2024 – పుష్పపల్లకీసేవ
07.03.2024 – గజవాహనసేవ
08.03.2024 – మహాశివరాత్రి – ప్రభోత్సవం – నందివాహనసేవ, లింగోదృవకాల మహాన్యాస
పూర్వక రుద్రాభిషేకం – పాగాలంకరణ — స్వామిఅమ్మవార్ల బ్రహ్మోత్సవ కల్యాణం
09.03.2024 – రథోత్సవం — తెప్పోత్సవం
10.03.2024 – యాగ పూర్ణాహుతి, సదస్యం, నాగవల్లి, ఆస్థాన సేవ, ధ్వజావరోహణ
11.03.2024- అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం
పట్టువస్తాల సమర్పణ :
01.03.2024 – శ్రీ కాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం
02.03.2024 — శ్రీ వేంకటేశ్వర స్వామివార్ల దేవస్థానం, ద్వారకా తిరుమల
03.03.2024 – శ్రీ దుర్దా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడ
04.03.2024 – ఉదయం – శ్రీవరసిద్ధివినాయకస్వామివార్ల దేవస్థానం – కాణిపాకం
సాయంకాలం — తిరుమల తిరుపతి దేవస్థానం
05.03.2024 — రాష్ట్ర ప్రభుత్వం
చలువ పందిర్లు :
శివదీక్షాశిబిరాలు, టోల్గేట్ సమీపంలోగల బసవవనం, సిబ్బంది వసతి గృహాల వద్దగల బాలగణేశ
వనం, ఆలయదక్షిణభాగంలో గల రుద్రాక్షవనం, శివాజీగోపురం ఎదురుగా గల శివాజీపార్కు,
తెలుగు విశ్వవిద్యాలయం సమీపంలో గల రుద్రాపార్కు, మల్లమ్మకన్నీరు మొదలైనచోట్ల చలువ
పందిర్లు వేసి భక్తులు సేద తీరేందుకు అవకాశం కల్పించారు.
*సాక్షిగణపతి, పార్కింగ్ ప్రదేశాలు, అన్నదానభవనము, కల్యాణకట్ట,చండీశ్వరసదనం మొదలైన
ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువపందిర్లు వేసారు.
ఆర్జితసేవలు, దర్శనములు:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 01.03.2024 నుండి 11.03.2024 వరకు అన్ని ఆర్జిత సేవలు
నిలిపివేశారు.
ఈ ఉత్సవ రోజులలో భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమేకల్పిస్తారు.
అయితే జోతిర్ముడి కలిగియున్న శివదీక్షాభక్తులకు మాత్రం ఉత్సవాలలో అయిదు రోజులపాటు
అనగా 01.03.2024 నుండి 05.3.2024 వరకు నిర్జీత వేళలలో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనమునకు
అవకాశం కల్పిస్తారు.
ఉత్సవాలలో తేది : 05.3.2024 రాత్రి గం.7.30 నుండి 11.03.2024 రాత్రి వరకు శ్రీస్వామివార్ల
స్పర్శదర్శనం పూర్తిగా నిలిపి వేయబడుతుంది.
విరామదర్శనం
ఉత్సవ రోజులలో తేదీ : 05.03.2024 నుండి 11.03.2024 వరకు ప్రముఖులకు విరామ దర్శన
వేళలో మాత్రమే దర్శనం కల్పిస్తారు. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బంది లేకుండా
ఉండేందుకు ఈ విరామ దర్శనం ఏర్పాటు చేసారు.
మొదటి విడత : ఉదయం గం. 6.30 ని. ల నుంచి గం. 7.30 ని. ల వరకు
రెండవ విడత : మధ్యాహ్నం గం. 12.30 ని. ల నుంచి గం.01.00 ని. ల వరకు
మూడవ విడత : సాయంత్రం గం. 07.00 ని.ల నుంచి గం. 7.30 ని. ల వరకు
క్యూలైన్లు:
భక్తుల సౌకర్యార్థం మూడు క్యూలైన్లను ఏర్పాటు చేసారు.
ఉచితదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేసారు.
ఉచితదర్శన క్యూలైను రథశాల నుంచి ప్రారంభమవుతుంది. రథశాల వద్ద నుంచి క్యూలైన్లలో
ప్రవేశించిన ఉచిత సర్వదర్శనం భక్తులకు క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం కలిస్తారు.
ఈ సర్వదర్శనం భక్తులకు క్యూ కాంప్లెక్స్ నందు వేచి వుండేందుకువీలుగా మొత్తం
17 కంపార్టుమెంట్లలో ఆయా ఏర్పాట్లను చేసారు.
శీఘ్రదర్శనం (రుసుము రూ.200/లు) క్యూలైను మరియు అతిశీఘ్రదర్శనం (రుసుము
రూ. 500/-లు) క్యూలైన్లు క్యాంపుకోర్టు భవనం ముందుభాగం నుంచి ప్రారంభమవుతాయి.
ఈ క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు వేచివుండేందుకు క్యూకాంప్లెక్స్ నందు మొత్తం 8 కంపార్టుమెంట్లలో
ఆయా ఏర్పాట్లు చేశారు.
సాక్షిగణపతి, పార్కింగ్ ప్రదేశాలు, అన్నదానభవనము, కల్యాణకట్ట,చండీశ్వరసదనం మొదలైన
ఆరుబయలు ప్రదేశాలలో కూడా చలువపందిర్లు వేసారు.
ఆర్జితసేవలు మరియు దర్శనములు:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో అనగా 01.03.2024 నుండి 11.03.2024 వరకు అన్ని ఆర్జిత సేవలు
నిలిపివేసారు.
ఈ ఉత్సవ రోజులలో భక్తులకు శ్రీస్వామివారి అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తారు.
అయితే జోతిర్ముడి కలిగియున్న శివదీక్షాభక్తులకు మాత్రం ఉత్సవాలలో అయిదు రోజులపాటు
అనగా 01.03.2024 నుండి 05.3.2024 వరకు నిర్జీత వేళలలో శ్రీ స్వామివారి స్పర్శ దర్శనమునకు
అవకాశం కల్పించబడింది.
ఉత్సవాలలో తేది : 05.3.2024 రాత్రి గం.7.30 నుండి 11.03.2024 రాత్రి వరకు శ్రీస్వామివార్ల
స్పర్శదర్శనం పూర్తిగా నిలిపి వేయబడుతుంది.
విరామదర్శనం
ఉత్సవ రోజులలో తేదీ : 05.03.2024 నుండి 11.03.2024 వరకు ప్రముఖులకు విరామ దర్శన
వేళలో మాత్రమే దర్శనం కల్పించబడుతుంది. సర్వదర్శనం క్యూలైన్లలోని భక్తులకు ఇబ్బంది లేకుండా
ఉండేందుకు ఈ విరామ దర్శనం ఏర్పాటు చేయబడింది.
మొదటి విడత : ఉదయం గం. 6.30 ని. ల నుంచి గం. 7.30 ని. ల వరకు
రెండవ విడత : మధ్యాహ్నం గం. 12.30 ని. ల నుంచి గం.01.00 ని. ల వరకు
మూడవ విడత : సాయంత్రం గం. 07.00 ని.ల నుంచి గం. 7.30 ని. ల వరకు
క్యూలైన్లు
భక్తుల సౌకర్యార్థం మూడు క్యూలైన్లను ఏర్పాటు చేయడం జరిగింది.
ఉచితదర్శనం, శీఘ్రదర్శనం, అతిశీఘ్రదర్శనం క్యూలైన్లు ఏర్పాటు చేయబడ్డాయి.
ఉచితదర్శన క్యూలైను రథశాల నుంచి ప్రారంభమవుతుంది. రథశాల వద్ద నుంచి క్యూలైన్లలో
ప్రవేశించిన ఉచిత సర్వదర్శనం భక్తులకు క్యూకాంప్లెక్స్ ద్వారా ఆలయ ప్రవేశం కల్పిస్తారు.
ఈ సర్వదర్శనం భక్తులకు క్యూ కాంప్లెక్స్ నందు వేచి వుండేందుకువీలుగా మొత్తం
17 కంపార్టుమెంట్లలో ఆయా ఏర్పాట్లను చేశారు.
శీఘ్రదర్శనం (రుసుము రూ.200/లు) క్యూలైను మరియు అతిశీఘ్రదర్శనం (రుసుము
రూ. 500/-లు) క్యూలైన్లు క్యాంపుకోర్టు భవనం ముందుభాగం నుంచి ప్రారంభమవుతాయి.
ఈ క్యూలైన్ల ద్వారా వచ్చే భక్తులు వేచివుండేందుకు క్యూకాంప్లెక్స్ నందు మొత్తం 8 కంపార్టుమెంట్లలో
ఆయా ఏర్పాట్లు చేసారు.
పాదయాత్ర భక్తులకు మంచినీటి సదుపాయం :
వెంకటాపురం, నాగలూటి, పెద్దచెరువు, భీమునికొలను మెట్లమార్దం, కైలాసద్వారం, హాటకేశ్వరం,
సాక్షిగణపతి మొదలైనచోట్ల మంచినీటిసదుపాయం కలిస్తున్నారు.
పార్కింగ్ ప్రదేశాలు :
మొత్తం 38ఎకరాల విస్తీర్ణంలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేసారు.
జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల సమీపప్రాంతం, ఆగమ పాఠశాల ఎదురుగాగల ప్రదేశం,
విభూతిమఠం సమీప ప్రాంతంలో, ఫిల్టర్ బెడ్, గణేశసదనం ఎడమవైపు యజ్ఞవాటిక, వాసవీవిహార్
వద్ధ, ఆర్.టీ.సి. బస్టాండ్ వెనుక ప్రాంతం, హేమారెడ్డి మల్లమ్మ మందిరం, గురుసదన్ ఎదరుగాగల
ప్రదేశం తదితర చోట్ల పార్కింగ్ ఏర్పాట్లు చేసారు.
రింగురోడ్డు వద్ద ఏ.పీ.ఎస్. ఆర్.టి.సి, తెలంగాణ ఆర్.టి.సి. కర్టాటక ఆర్.టి.సి బస్సులకు పార్కింగ్
ఏర్పాట్లు చేయబడ్డాయి.
అదేవిధంగా టూరిస్ట్ బస్సులు కర్దాటక బస్సు పార్కింగుకు ఎగువ ప్రదేశంలో పార్కింగు
చేయబడుతాయి.
ఉచిత వాహన సదుపాయం:
భక్తులు తాము దిగిన చోటు నుంచి ఆయా ప్రదేశాలు వెళ్ళేందుకు దేవస్థానం ఉచిత వాహన
సదుపాయంలో భాగంగా 5 బ్యాటరీ వాహనాలు, 10 ఉచిత బస్సులు ఏర్పాటు చేసారు.
వైద్యసేవలు :
దేవస్థానం వైద్యశాల, మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బ్రహ్మోత్సవాలలో మండల ప్రాథమిక ఆరోగ్య
కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసే తాత్కాలిక 30 పడకల వైద్యశాలలో యాత్రికులు అవసరమైన
వైద్యసేవలను ఉచితంగా పొందవచ్చు.
వీటితో పాటు క్షేత్రపరిధిలో పలుచోట్ల తాత్కాలిక వైద్యశిబిరాలు కూడా ఏర్పాటు చేసారు.
వైద్యశిబిరాలు :
వైద్యఆరోగ్యశాఖ వారి సహకారంతో మొత్తం 10చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు.
కైలాసద్వారం, క్షేత్రపరిధిలో టోల్గేట్, ఆలయమహాద్వారం, శివదీక్షా శిబిరాలు, పాతాళగంగ మెట్ల
మార్గం, పాతాళగంగ స్నానఘట్టాలు, మల్లమ్మకన్నీరు, టూరిస్ట్ బస్టాండ్, ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్టాండ్
మొదలైన చోట్ల మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు.
అన్నప్రసాద వితరణ :
భక్తులు ఆలయసమీపంలోగల (దేవస్థానం పరిపాలనాభవనం వెనుకభాగంలో) అన్నపూర్ణ భవనంలో
అన్నప్రసాదాలను అందిస్తారు.
బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక విధులు నిర్వహించే వివిధ శాఖల సిబ్బందికి, శివసేవకులకు ( స్వచ్చంద
సేవకులకు), ధార్మిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరగు కళాకారులకు అన్నప్రసాద
వితరణ భవనంలోనే అల్పాహారం మరియు భోజనం ఏర్పాట్లు వుంటాయి.
దేవస్థాన అన్నదాన భవనం నుంచి భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించవచ్చు.
వీటికి తోడు క్షేత్రములో పలుచోట్ల స్వచ్చందసేవాసంస్థల వారు అన్నదానాలను చేస్తారు.
దేవస్థానం పూర్తి సహాయసహకారాలను అందిస్తుంది.
పుణ్య స్నానాలు ఏర్పాటు :
* పాతాళగంగ వద్ద భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు ఏర్పాటు చేసారు.
* పాతాళగంగ నీటిమట్టం తగ్గుతున్న కారణంగా స్నానాలఘాట్ ఎగువ భాగంలో జల్లుస్నానానికి కూడా
అవకాశం కలించారు.
* ఆలయ సమీపంలో క్షత్రియ సత్రం దగ్గర) గంగాభవాని స్నానఘట్టాలలో కూడా భక్తులు
స్నానాలాచరించవచ్చు.
ఇవేకాక పలు ప్రదేశాలలో కూడా స్నానాలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు కలించారు..
పాతాళగంగమార్గంలోని కల్యాణకట్ట, రాజులసత్రం దగ్గర, ఆర్.టి.సి. బస్టాండ్ వెనుక భాగంలో,
శివదీక్షా శిబిరాల వద్ధ దగ్గర, పాతాళగంగ మార్గంలోని డార్మెటరీల వెనుకభాగంలో, ప్రభుత్వ ఉన్నత
పాఠశాల దగ్గర, చల్లా వెంకయ్య సత్రం ఎదురుగా ( బసవవనంలో ), సిబ్బందివసతిగృహాల వద్ద,
యజ్ఞవాటిక వద్ద వాహనాలు నిలుపు స్ధలం ( స్నానపు గదులు ), గణేశసదనం ఎదురుగా ( స్నానపు
గదులు), వలయ రహదారిలో నక్షత్ర వనం ఎదురుగా ( స్నానపు గదులు), గంగాభవానీ స్నానఘట్టాలకు
ఎదురుగా ( స్నానపు గదులు) మొత్తం 12 చోట్ల ఏర్పాటు చేసారు.
సామాన్లు భద్రపరిచే గదులు :
* భక్తుల సౌకర్యార్థం పలుచోట్ల సామాన్లు భద్రపర్చుకోవడానికి ఏర్పాట్లు చేసారు.
* పెద్ద సత్రం వద్ద, క్యూకాంప్లెక్స్ ఎదురుగా, గంగాధరమండపం సమీపంలోని లింగాయత సత్రం, టూరిస్ట్
బస్టాండ్, పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసారు.
శౌచాలయాలు :
క్షేత్రపరిధిలో పలుచోట్ల మొత్తం 787 శాశ్వత శౌచాలయాలు అందుబాటులోకి తెచ్చారు.
వీటిలో 160 శాశ్వత శౌాచాలయాలు మరియు స్నానపు గదులు, 172 టాటా శౌాచాలయాలు, 58 నమ్మ
శౌచాలయాలు, 18 స్నానపుగదులు, 46 మూత్రశాలలు, అందుబాటులో ఉన్నాయి.
వీటికి అదనంగా క్షేత్రపరిధిలో తాత్కాలికంగా కూడా మరుగుదొడ్లు ఏర్పాటు చేసారు.
విద్యుద్దీపాలు:
పార్కింగ్ ప్రదేశాలు, భక్తులు సేద తీరేందుకు ఏర్పాటు చేయబడిన చలువపందిర్లు, ఆలయ
మాడవీధులు, ప్రధాన వీధులు మొదలైన చోట్ల లైటింగ్ ఏర్పాట్లు చేయబడుతున్నాయి.
నాగలూటి మరియు. కైలాసద్వారం వద్ద జనరేటర్ ఏర్పాటు చేసి లైటింగ్ ఏర్పాటు
చేస్తున్నారు.
ఆలయప్రాంగణం, రథవీధి, క్షేత్రపరిధిలో పలుచోట్ల విద్యుద్దీపాలంకరణ చేసారు.
పుష్పాలంకరణ :
బ్రహ్మోత్సవాలు జరిగే 11 రోజులు కూడా ప్రత్యేకంగా పుష్పాలంకరణకు చర్యలు తీసుకున్నారు
స్వాగత తోరణాలు
ఉత్సవాలలో పండగ వాతావరణం ఉండేందుకు క్షేత్రపరిధిలో పలుచోట్ల స్వాగత తోరణాలు ఏర్పాటు
చేసారు.
సాంస్కృతిక కార్యక్రమాలు :
ఆలయ పుష్కరిణి వద్ద గల భ్రామరీకళావేదిక, శివదీక్షా శిబిరాల వద్ద గల నటరాజ కళావేదిక ,
ఆలయ మాడవీధిలోని నిత్యకళారాదన వేదిక వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
శ్రీ స్వామిఅమ్మవార్ల గ్రామోత్సవంలో పలు జానపద కళా రూపాలు ఏర్పాటు చేసారు.
కమాండ్ కంట్రోల్ రూమ్
అన్నదాన భవన సముదాయం వద్ద కమాండ్ కంట్రోల్ రూములో కంట్రోలింగ్ పాయింట్ ఏర్పాటు
చేసారు.
కంట్రోల్ రూములో 18 ఎల్.ఈ.డి టీవీలు అందుబాటులో ఉన్నాయి.
15 పి.టి.జెడ్ కెమెరాలు, 2 పీపుల్స్ కౌటింగు కెమెరాలు, 478 స్టాటిక్ సి.సి. కెమెరాలు, 3 వెహికల్
నెంబర్ ప్లేట్ డిటెక్టివ్ కెమెరాలు ఏర్పాటు చేసారు.
ఫ్లెక్సీబోర్డులు :
ఉత్సవాలలో మొత్తం 1300 పైగా సూచికబోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
మార్గ సూచికబోర్జులు , సమాచార బోర్డులు, మొదలైన బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.