
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న వీరశైవ ఆగమపాఠశాల విద్యార్థులకు శనివారం చంద్రవతి కల్యాణ మండపంలో వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి.
మూడు రోజుల పాటు జరిగే ఈ వార్షికపరీక్షలు ఈ నెల 28న ముగియనున్నాయి. ప్రవేశ, వర, ప్రవర కోర్సులకు సంబంధించి ఈ ఆగమ పరీక్షలు జరుగుతున్నాయి.
ఈ వార్షిక పరీక్షలకు మొత్తం 105 మంది విద్యార్థులు హాజరవుతున్నారు.
సంస్కృతం, ఆహ్నికం, నిత్యరాధన అంశాలలో ఈ వార్షిక పరీక్షలు జరుగుతున్నాయి. సంబంధిత అంశాలలో వ్రాత పరీక్షతో పాటు మౌఖిక . ప్రయోగ పరీక్షలు కూడా వుంటాయి. కాగా ఈ పరీక్ష నిర్వహణకు డా. ఎం. మహంతయ్య, ఆగమ పండితులు ముఖ్య పరీక్ష అధికారిగా వ్యవహరిస్తున్నారు.
ఈ వార్షిక పరీక్ష నిర్వహణలో ఎం. శివశంకరయ్య, స్వామివార్ల ఉప ప్రధానార్చకులు , దేవస్థానం ఆగమ పాఠశాల ప్రిన్సిపల్ ఎం. శివశంకరయ్య, దేవస్థానం పర్యవేక్షకులు, కె. గిరిజామణి, డి. నాగేశ్వరరావు, జూనియర్ అసిస్టెంట్ వి. సరోజ తదితరులు పాల్గొన్నారు.