*హైదరాబాద్: తెలంగాణ సారస్వత పరిషత్ లో డా.సి.నారాయణరెడ్డి 90వ జయంత్యుత్సవం జరిగింది . తెలంగాణ సారస్వత పరిషత్, శ్రీమతి సుశీలా నారాయణరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ కవి జూకంటి జగన్నాధం కు సినారె పురస్కారం అందించారు . రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి , జాస్తి చలమేశ్వర్ , డాక్టర్ వరప్రసాద్ రెడ్డి , పరిషత్ చైర్మన్ ఎల్లూరి శివారెడ్డి , కార్యదర్శి జుర్రు చెన్నయ్య, కోశాధికారి మంత్రి నర్సింహయ్య , దేశపతి శ్రీనివాస్ పాల్గొన్నారు.