మీరు గుంపుగా వచ్చినా మేం సింగిల్ గానే ఓడిస్తాం

– గుర్రాలగొంది ప్రజల అభిమానంతో భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్ రావు

*ఒక నాయకుడికి ఇంతకంటే గొప్ప గౌరవం దొరకదు.

– గతంలోనూ పెండ్లిలకు కట్నం చదివించినట్లు రాజీనామా చేసి వచ్చిన నాకు నోట్లు ఇచ్చారు, ఓట్లు వేశారు.

– రైతు బంధు పథకం రైతులకు ఆసరాగా నిలుస్తొంది.

– కాళేశ్వరం ప్రాజెక్టు 90 శాతం పూర్తయింది.

– ప్రాజెక్టు పూర్తయితే కాలం అయినా కాకున్నా నీళ్ల బాధ ఉండదు.

– వచ్చే వానాకాలం నాటికి గోదావరి జలాలు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాయి.

– నాకు ఎంత పని ఉన్న చాలా సార్లు మీ గ్రామానికి వచ్చిన.

– అదే కాంగ్రెస్ వాళ్లు వస్తారా ? ఓట్ల కాలం వస్తే గుంపులుగా వస్తారు.. నోటికిచ్చిన వాగ్దానాలు చేసి పోతారు.

– కుర్చీ కోసం అన్ని పార్టీలు కలుస్తున్నాయి.

– మీరు గుంపుగా వచ్చినా మేం సింగిల్ గానే ఒడిస్తాం.

– కాంగ్రెస్ నాడు మోసం చేసింది.. మళ్లీ ఇప్పుడూ మోసం చేస్తున్నది.

— అధికారం కోసం చంద్రబాబు తో కాంగ్రెస్ కలుస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నందుకు వారికి ఓటేయ్యాలా ?

– పార్టీ పెడితే దేశమంతా నా వైపు ఉంటారన్న కోదండరాం ఇప్పుడు రెండు, మూడు సీట్లు కోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు పొర్లు దండాలు పెడుతున్నాడు.

– కేసిఆర్ నీడలో ఎదిగిన కోదండరాం తనకు తాను గొప్పగా ఉహించుకున్నాడు.

– 50 సార్లు ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి, నేను తిరిగినా మా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారా ?

– నిన్నటి దాఖా చంద్రబాబు తో కలిసి తెలంగాణకు అన్యాయం చేశారు.

– రాత్రికి రాత్రి 7 మండలాలను ఆంధ్రలో కలపలేదా ?

– ఒక్క వేళా వారే గెలిస్తే మళ్ళీ ఢిల్లీకి గులాం గిరి తప్పదు.

– దేశానికే ఆదర్శవంతమైన పాలన ముఖ్యమంత్రి కేసిఆర్ అందిస్తున్నారు.

– గుర్రాలగొంది ప్రజల అభిమానంతో భావోద్వేగానికి గురైన మంత్రి హరీశ్ రావు

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.