×

83 లక్షల మందికి కోవిడ్ టీకాలు

83 లక్షల మందికి కోవిడ్ టీకాలు

ప్రస్తుతం భారతదేశంలో చికిత్సపొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,39,637 కి తగ్గింది. ఇది మొత్తం కోవిడ్ పాజిటివ్ గా తేలినవారిలో 1.28% మాత్రమే. గత 24 గంటలలో 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 5,000 మందికి లోపే చికిత్స పొందుతూ ఉన్నారు. త్రిపుర, డామన్-డయ్యూ, దాద్రా-నాగర్ హవేలి లో ప్రస్తుతం ఇద్దరేసి మాత్రమే కోవిడ్ చికిత్సలో ఉన్నారు.

కేరళ, మహారాష్ట్ర, కర్నాటక రాష్టాలలోనే మొత్తం చికిత్సలో ఉన్నవారిలో  76.5% మంది ఉన్నారు. అందులోనూ కేరళ, మహారాష్ట్ర కలిపి ఆ మొత్తంలో 74.72% కేసులు ఉన్నాయి.

గత 24 గంటలలో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఒక్క కోవిడ్ మరణం కూడా నమోదు కాలేదు. ఇవి: అస్సాం, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, ఉత్తరాఖండ్, మణిపూర్, నాగాలాండ్, లక్షదీవులు, మేఘాలయ, సిక్కిం, అండమాన్, నికోబార్ దీవులు, లద్దాఖ్, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర, దాద్రా-నాగర్ హవేలి, డామన్- డయ్యూ

గతవారమంతా ఒక్క మరణం కూడా నమోదు కాని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు 10 ఉన్నాయి. అవి: అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, డామన్-డయ్యూ, దాద్రా- నాగర్ హవేలి, లద్దాఖ్, లక్షదీవులు, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర

2021 ఫిబ్రవరి 15వ తేదీ ఉదయం 8 గంటలకు మొత్తం టీకాలు వేయించుకున్న ఆరోగ్య సిబ్బంది, కోవిడ్ యోధులు కలిపి దాదాపు 83 లక్షలకు చేరింది.

ఉదయం 8 గంటలకు అందిన తాత్కాలిక సమాచారం ప్రకారం 1,73,729 శిబిరాల ద్వారా మొత్తం 82,85,295 మంది టీకాలు తీసుకున్నారు.  వీరిలో 59,88,113 మంది మొదటి డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది కాగా 24,561మంది రెండో డోస్ అందుకున్న ఆరోగ్య సిబ్బంది,  మొదటి డోస్ మాత్రమే ఎంచుకున్న కోవిడ్ యోధులు  22,72,621 మంది ఉన్నారు.  రెండో డోస్ కోవిడ్ ఈనెల 13న మొదలు కాగా, మొదటి డోస్ తీసుకున్నవారిలో 28 రోజులు నిండినవారికి రెండో డోస్ ఇవ్వటం మొదలైంది.

క్రమ సంఖ్య  

రాష్ట్రం/కేంద్రపాలితప్రాంతం

డోసులు  
1వ డోస్ 2వ డోస్ మొత్తం డోసులు
1 అండమాన్, నికోబార్ దీవులు 3,646 0 3,646
2 ఆంధ్రప్రదేశ్ 3,56,521 5,820 3,62,341
3 అరుణాచల్ ప్రదేశ్ 15,633 461 16,094
4 అస్సాం 1,27,658 2,215 1,29,873
5 బీహార్ 4,92,152 0 4,92,152
6 చండీగఢ్ 8,660 143 8,803
7 చత్తీస్ గఢ్ 2,62,092 895 2,62,987
8 దాద్రా, నాగర్ హవేలి 2,922 41 2,963
9 డామన్, డయ్యూ 1,121 30 1,151
10 ఢిల్లీ 1,89,351 1,856 1,91,207
11 గోవా 13,166 517 13,683
12 గుజరాత్ 6,83,903 0 6,83,903
13 హర్యానా 1,95,764 588 1,96,352
14 హిమాచల్ ప్రదేశ్ 81,482 475 81,957
15 జమ్మూ కశ్మీర్ 1,28,822 807 1,29,629
16 జార్ఖండ్ 2,06,182 2,209 2,08,391
17 కర్నాటక 4,96,234 0 4,96,234
18 కేరళ 3,58,529 46 3,58,575
19 లద్దాఖ్ 2,904 77 2,981
20 లక్షదీవులు 1,776 0 1,776
21 మధ్యప్రదేశ్ 5,57,105 0 5,57,105
22 మహారాష్ట్ర 6,82,744 189 6,82,933
23 మణిపూర్ 22,726 169 22,895
24 మేఘాలయ 13,998 91 14,089
25 మిజోరం 11,680 74 11,754
26 నాగాలాండ్ 9,695 123 9,818
27 ఒడిశా 4,12,046 0 4,12,046
28 పుదుచ్చేరి 5,953 71 6,024
29 పంజాబ్ 1,03,799 59 1,03,858
30 రాజస్థాన్ 6,10,088 0 6,10,088
31 సిక్కిం 8,335 0 8,335
32 తమిళనాడు 2,46,420 1,154 2,47,574
33 తెలంగాణ 2,78,915 3,273 2,82,188
34 త్రిపుర 69,196 366 69,562
35 ఉత్తరప్రదేశ్ 8,58,602 0 8,58,602
36 ఉత్తరాఖండ్ 1,10,326 0 1,10,326
37 పశ్చిమ బెంగాల్ 5,14,570 2,382 5,16,952
38 ఇతరములు 1,16,018 430 1,16,448
  మొత్తం 82,60,734 24,561 82,85,295

 

టీకాలు ప్రారంభమైన 30వరోజు ( ఫిబ్రవరి14) నాడు 21,437మందికి 877 శిబిరాలలో టీకాలు వేశారు. వారిలో  20,504 మంది మొదటి డోస్ తీసుకున్నవారు కాగా, 933 మంది ఆరోగ్య సిబ్బంది రెండో డోస్ తీసుకున్నవారున్నారు. దేశంలో రోజురోజుకూ టీకాలు తీసుకుంటున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

దేశవ్యాప్తంగా టీకాలు వేయించుకున్నవారిలో 69% మంది 10 రాష్ట్రాలకు చెందినవారున్నారు.  ఉత్తరప్రదేశ్ ఒక్కటే 8,58,602 మంది టీకా లబ్ధిదారులతో 10.4% వాటా పొందింది.

భారతదేశంలో కోవిడ్ నుంచి కోలుకున్నవారి మొత్తం సంఖ్య ఈ రోజుకు 1,06,21,220 కు చేరింది. కోలుకున్నవారి శాతం 97.29% అయింది. గత 24 గంటలలో 9,489 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో కోలుకున్నవారిలో 79.5% మంది ఆరు రాష్ట్రాలలో కేంద్రీకృతమయ్యారు.  కేరళలో అత్యధికంగా  ఒక రోజులో  4,692 మంది (50%) కోలుకోగా, మహారాష్ట్రలో 1,355 మంది, కర్నాటకలో 486 మంది కోలుకున్నారు.

గత 24 గంటలలో కొత్తగా 11,649 పాజిటివ్ కేసులు వచ్చాయి. వీరిలో 86.4% మంది ఆరు రాష్టాలకు చెందినవారున్నారు. కేరళలో అత్యధికంగా  ఒక రోజులో 4,612 కేసులు రాగా మహారాష్ట్రలో 4,092 మంది, తమిళనాడులో 470 మంది నమోదయ్యారు.

గత 24 గంటలలో 90 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీరిలో 80% మంది కేవలం ఆరు రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. మహారాష్ట్రలో అత్యధికంగా 40 మంది (44.44%) చనిపోగా, కేరళలో 15 మంది, తమిళనాడులో ఆరుగురు చనిపోయారు.

print

Post Comment

You May Have Missed