పద్ధతిగా ప్రభోత్సవం, నందివాహన సేవ, మహాసరస్వతి అలంకారం

 శ్రీశైల దేవస్థానం:ఉగాది మహోత్సవాలలో   మూడవ రోజు శనివారం  శ్రీ స్వామిఅమ్మవార్లకు ప్రత్యేక్య పూజలు జరిగాయి. ఆ తరువాత స్వామివారి యాగశాలలో చండీశ్వరపూజ, మండపారాధనలు, కోసం జపానుష్ఠానాలు రుద్రహోమం నిర్వహించారు.అదేవిధంగా ఉదయం అమ్మవారి యాగశాలలో చండీహోమం జరిగింది.

 అమ్మవారికి విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు చేశారు.  సాయంత్రం 5.30 గంటలకు సాయంకాల పూజలు, జపానుష్ఠానాలు జరిపారు.

ప్రభోత్సవం:

ఉగాది మహోత్సవాలలో భాగంగా ఈ సాయంకాలం గం.5.30లకు శ్రీస్వామిఅమ్మవార్ల ప్రభోత్సవం జరిపారు.

రథోత్సవంలో రథానికి చేసినట్లుగానే ప్రభోత్సవంలో కూడా ప్రభకు బంతి, చేమంతి, గులాబి, సుగంధాలు, కనకాంబరాలు మొదలైన 11 రకాల పుష్పాలతో పుష్పాలంకరణ చేశారు.

నందివాహన సేవ:

 వాహన సేవలలో భాగంగా ఈ రోజు సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు నందివాహనసేవ నిర్వహించారు.

ఈ సేవలో శ్రీ స్వామిఅమ్మవారి ఉత్సవమూర్తులను నందివాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. తరువాత గ్రామోత్సవం జరిపారు..

నందివాహనాధీశులైన శ్రీస్వామి అమ్మవార్లను దర్శించడం వలన చేపట్టిన పనులలో విజయం లభిస్తుందని, భోగభాగ్యాలు కలుగుతాయని నమ్మకం.

:

ఉగాది మహోత్సవాల అలంకారాలలో భాగంగా ఈ సాయంకాలం శ్రీ అమ్మవారి ఉత్సవమూర్తిని మహాసరస్వతి స్వరూపంలో అలంకరించారు.

చతుర్భుజాలు కలిగి ఉండి, వీణ, అక్షమాల పుస్తకాన్ని ధరించిన ఈ దేవిని దర్శించడం వలన విద్యాప్రాప్తితో పాటు అభీష్టాలు సిద్ధిస్తాయని ప్రతీతి.

గ్రామోత్సవంలో కోలాటం, చెక్కభజన, జానపద పగటి వేషాల ప్రదర్శన, తప్పెటచిందు, కర్ణాటక జాంజ్, కన్నడ జానపదడోలు, నందికోలుసేవ, మొదలైన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.

ఈ రోజు రాత్రి గం.10.00లకు శివదీక్షా శిబిరాల వద్ద కన్నడ భక్తులచే అగ్నిగుండ ప్రవేశ కార్యక్రమం ప్రత్యేకం. వీరాచార సంప్రదాయాన్ని అనుసరించి జరిపే ఈ కార్యక్రమానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అగ్నిగుండ ప్రవేశానికి ముందు వీరాచార విన్యాసాలు జరుగనున్నాయి.

కర్ణాటకు చెందిన వీరశైవ భక్తులు వీరభద్రవచనాలను పఠిస్తూ, ప్రత్యేక వేషధారణలతో, వివిధ వాయిద్యాల నడుమ విన్యాసాలు చేయనున్నారు. వీరిని పురవంతులు అని పిలుస్తారు

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.