శ్రీశైల దేవస్థానంలో శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఏకాంతంగా ఊయలసేవ
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (27.03.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయల సేవను నిర్వహించారు.
ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించబడుతోంది. ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయల సేవ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపించారు.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్తోక్తంగా షోడశోపచార పూజ జరిపించబడుతుంది.
ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు జరిపించారు. చివరగా ఊయల సేవ నిర్వహించారు.
ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడుతాయి.అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేసి ఊయలను కూడా శోభయమానంగా అలంకరించడం జరిగింది.
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినయోగించబడనున్నాయి. అదేవిధంగా ఊయలకు కూడా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది.
దర్శనాలు నిలిపివేస్తున్నందువల్ల ఈ ఊయల సేవను అర్చకులు, వేదపండితులు ఏకాంతంగా నిర్వహించారు.