గచ్చిబౌలి లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ , బ్రహ్మకుమారీలు సంయుక్తంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలలో భాగంగా ‘ గ్లోబల్ కల్చరల్ ఫెస్టివల్ ‘ ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి , పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బ్రహ్మకుమారీల తో కలిసి ప్రారంభించారు .బతుకమ్మ సంబురాల విశ్వ వ్యాప్తికి బ్రహ్మ కుమారీ లు చేస్తున్న కృషిని అభినందించారు.బతుకమ్మ వేడుకలకు వివిధ దేశాల నుంచి వచ్చిన బ్రహ్మ కుమారీ లు నిర్వహించిన కళా ప్రదర్శనలు అద్బుతంగా ఉన్నాయన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి.
సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ బతుకమ్మ సంబురాలను విశ్వవ్యాప్తం చేసే కార్యక్రమములో భాగంగా గత ఏడాది 15 దేశాల నుంచి, ఈ సంవత్సరం 21 దేశాలలో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ బతుకు చిత్రం మార్చే పండుగ బతుకమ్మ అన్నారు. తెలంగాణ కు పరిమితమైన బతుకమ్మను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రభుత్వం బ్రహ్మ కుమారీ లతో కలసి అనేక కార్యక్రమాలను రూపోందిస్తున్నట్లు వెల్లడించారు. వివిధ దేశాల నుండి వచ్చిన బ్రహ్మకుమారీలు, బతుకమ్మ సంబురాలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో నేషనల్ B C కమిషన్ చైర్మన్ డా. ఈశ్వరయ్య గౌడ్, సంతోష్ దీదీ, కుల్దీప్ దీదీ లు పాల్గొన్నారు.