Sri Ahobila Math Paramparaadhrena Sri Adivan Satagopa Yatheendra Mahadesika Sri Lakshmi Narasimha Swamy Devasthaanam, Ahobilam.
Sri jwala narasimha swamy coming down the hill for paruveta utsavam which starts tomorrow and will be celebrated for 40 days.. Sri Adivan satagopa yatheendra mahadesika swamy,who started 40 days Paruveta utsavam by the divine commond offered Darshana Thamboolam to sri Jwala Narasimha swamy . with sakala rajopacharam sri jwala narasimha swamy is taken to Diguva Ahobilam temple.
*
శ్రీ అహోబిల మఠం పరంపరాధీన
శ్రీ మదాదివణ్ శఠగోప యతీంద్ర మహాదేశిక
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం, అహోబిలం:
శ్రీ అహోబలేశ్వరుల శ్రీ సన్నిధిలో రేపటి నుంచి 40 రోజుల పాటు జరిగే పారువేట ఉత్సవానికి ఆదివారం ఎగువ అహోబిలం నుంచి శ్రీ జ్వాలా నరసింహ స్వామి వారు కొండ దిగినారు.మరే ఇతర దివ్యదేశములోను లేని విధంగా అహోబిలం లో 40 రోజుల పారువేట ఉత్సవం నిర్వహిస్తారు.
కొండ దిగిన అహోబలేశ్వరులను దిగువ అహోబిలం చేరగానే పారువేట ఉత్సవాలను ప్రారంభించి ,జనులందరికి అహోబలేశ్వరులను చేరువ చేసిన అహోబిల దేవాలయ ధర్మకర్త,అహోబలేశ్వరులచే సన్యాసాశ్రమును స్వీకరించిన వారు శ్రీ అహోబిల మఠం స్థాపనాచార్యులైన శ్రీ ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్ స్వామి ,దర్శన తాంబూలం సమర్పించి,సమస్త రాజోపచారములతో దిగువ అహోబిలం ఆలయానికి తీసుకొని వచ్చారు.
అహోబిలం పారువేట ఉత్సవం…ఆదివన్ శఠగోప యతీంద్ర మహాదేశికన్
అహోబిలంలో రేపటి నుంచి పారువేట ఉత్సవాలు ప్రారంభమౌతాయి.ఈ పారువేట ఉత్సవాన్ని అహోబిల మఠం స్థాపనాచార్యులైన ఆదివన్ శఠగోప యతి ప్రారంభించారు. .సుమారు 600 ఎళ్ళ క్రితం ప్రారంభించైన ఉత్సవం నేటికి నిరాటంకంగా జరుగుతున్నది?
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
1.మొదట అహోబిల మతం స్థాపనకు సంబంధించిన చరిత్రను పరిశీలిస్తే,నరసింహ దేవుడు ఆదివన్ శఠగోప యతికి చెప్పిన మాటలు గమనార్హమైనవి. గ్రామే గ్రామేచ గత్వా పద చరణయో: మామ్ గృహీత్వ
దీని అర్ధం….గ్రామ గ్రామమునకు నన్ను వేంచేపు చేసి అందరిని నా పాదములను ఆశ్రయింపచేయుము.
దీనిని బట్టి శ్రీ అహోబిల మఠం స్థాపించినపుడే పారువేట ఉత్సవాన్ని నిర్వహించమని నృసింహ దేవుడే మఠం స్థాపనాచార్యులను ఆదేశించారని భావిస్తున్నారు.
2.ఆదివన్ శఠగోప యతి శిష్యులు,ఆయన సమకాలికులైన అన్నమయ్య అహోబిల నారసింహుని మీద అనేక కీర్తనలు రాశారు.అందులో ఒక కీర్తన ఇక్కడ ప్రస్థావనార్హం.. .దేవశిఖామణి దివిజులు వొగడగాఈ కీర్తన చివర అహోబిల బిలమున సారెకు బోదలి వాడే అని ఉన్నది.ఈ సంకీర్తన వర్ణన అంతా ఒక గుర్రం మీద వీధులన్నీ తిరగటం గురించే ఉన్నది.పారువేట అంటే గుర్రం మీద స్వారీ చేస్తూ వేటాడడం.
ఇక్కడ సారె అంటే మాటిమాటికి అని,పెళ్లికి ఇచ్ఛే కానుక అని. ఏ అర్థం తీసుకున్న
అహాబిలములో పారువేట ఉత్సవ సంకీర్తన అన్నది సుస్పష్టం.అన్నమయ్య ఆదివన్ శఠగోప యతి సమకాలికుడు కావడం వల్ల అహోబిలం పారువేట ఉత్సవం ఆదివన్ శఠగోప యతియే ప్రారంభిచారన్నది భావిశ్తున్నారు గా జరిగింది అన్న విషయం మనకు తెలుస్తుంది.ఈ శాసనాలలో అహోబలేశ్వరులు పారువేటకు వెళ్లే గ్రామాల పేర్లు ప్రస్తావించి ఉండటం గమనార్హం.అయితే శాసనాలలో పారువేటను తిరువలియాటఅని ప్రస్తావించారు. ఇది తమిళ పదం తిరువలియాడల్ యొక్క తెలుగు రూపం.తిరువలియాట అంటే స్వామి ఆడే దివ్యమైన ఆట.
4.ఇక అత్యంత ముఖ్యమైన విషయం …పారువేట ఉత్సవ సమయంలో ఇచ్చే మర్యాద క్రమం…పీఠాధిపతి వారికి ,వారు లేనప్పుడు వారి ముద్రకర్త కు మర్యాద ఇచ్చిన తరువాత ఒక క్రమ పద్ధతిలో కొంతమందికి మర్యాద ఇస్తారు.దీనికి గుడికట్టు అని పేరు.రెడ్డి,కర్ణం, వడ్లకమ్మరా,గుమస్తా ఇలా…..
ఇది కాకతీయ రాజుల కాలంలో వ్యవహారంలో ఉన్న ఆయగార్ల వ్యవస్థను పోలి ఉంది.కాకతీయ ప్రతాపరుద్ర మహారాజు చివారికాలంలోనే ఆదివన్ శఠగోప యతి సన్యాసాన్ని పొందారు.
శ్రీ ఆదివన్ శఠగోప యతి తమ ఆశ్రమ స్వీకారమైన తరువాత , ప్రతాపరుద్ర మహారాజు నుంచి స్వర్ణ నరసింహ స్వామి విగ్రహం పొందారు.అంటే పారువేట ఉత్సవం జరిగే తీరు ఆదివన్ శఠగోప స్వామి కాలంలోనే మొదలైంది. అహోబిలం పారువేట ఉత్సవం ఆదివన్ శఠగోప యతియే ప్రారంభించారనటానికి ఉదాహరణలున్నాయి .శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఆదివన్ శఠగోప యతి గురించి ఇంకా చాలా అంశాలు ఉన్నాయి . పరిశోధన జరగాలి – courtesy; kidambi sethu raman