24వ పాశురము : పెరుమాళ్ళకు మంగళాశాసనం.
అన్రివ్వులగ మళన్దాయ్! ఆడిపోట్రి
చ్చెన్రఙ్గుత్తెన్నిలఙ్గైశెత్తాయ్! తిఱల్ పోట్రి
పొన్రచ్చెగడ ముదైత్తాయ్ ! పుగళ్ పోట్రి
కన్రు కుణిలా వెఱిన్దాయ్ ! కళల్ పోట్రి
కున్రుకుడైయా వెడుత్తాయ్ ! గుణమ్ పోట్రి
వెన్రు పగైక్కెడుక్కుమ్ నిన్ కైయిల్ వేల్ పోట్రి
ఏన్రెన్రున్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్
ఇన్రియామ్ వన్దోమ్ ఇరఙ్గేలో రెమ్బావాయ్.
- ఆనాడు దేవతల నిమిత్తమై ఈ లోకమును కొలిచిన శ్రీ పాదములకు మంగళమగుగాక , లంకా నగరమునకు దండెత్తి వెడలి రాక్షసులను సంహరించిన బలమునకు మంగళమగుగాక , శకటాసురుని తన్ని నశిమ్పచేసిన కీర్తికి మంగళమగు గాక , దూడ గా మారి వచ్చిన రాక్షసుని, వెలగ పండు రూప ముగా వచ్చిన మరియొక రాక్షసుని మీద విసిరి వేగినప్పుడు పొంకముగా ఉంచుకున్న శ్రీ పాదములు మంగళముగా ఉండు గాక , గొల్లలు ఇంద్రునికి పెట్టు పొంగలిని శ్రీ కృష్ణుడు గోవర్ధనమునకు ఉంచుడని గొల్లలకు ఆజ్ఞ చేయగా వారట్లు చేయుటచే ఇంద్రుడు కోపించి ఏడు రోజులు రాళ్ళవాన కురిపించగా శ్రీ కృష్ణుడు గోవర్ధనమును గొడుగు గా ఎత్హి గొల్లలను , గోవులను రక్షించిన అట్టి గుణ విశేషమునకు మంగళము కలగాలి . శత్రు నాశాకమగు దేవర వారి బల్లెము క్షేమముగా ఉండాలని ఈ ప్రకారముగా దేవరవారి పరాక్రమమును పొగిడి పురుషార్థములను లభిన్చుటకు నేడు మేము వచ్చితిమి ; కృప చేయుము అనుచున్నారు .