శ్రీశైల దేవస్థానంలో ఏకాంతంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవ
శ్రీశైల దేవస్థానం, శ్రీశైలం: లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (17.04.2020) సాయంకాలం శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి ఊయలసేవను నిర్వహించింది.
ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ జరిపించబడుతోంది.ఈ సాయంత్రం గం. 7.30ల నుండి ఈ ఊయలసేవ నిర్వహించబడుతుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించబడింది.
అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్తోక్తంగా షోడశోపచార పూజ జరిపించబడింది.
ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్ర నామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన పూజలు జరిపించబడ్డాయి. చివరగా ఊయల సేవ నిర్వహించబడింది.
ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిపించబడ్డాయి. అదేవిధంగా శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేసి ఊయలను కూడా శోభయమానంగా అలంకరించడం జరుగింది. పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినయోగించబడనున్నాయి. అదేవిధంగా ఊయలకు కూడా విశేష పుష్పాలంకరణ చేయడం జరిగింది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ఆలయములో దర్శనాలు పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. అదేవిధంగా లాక్ డౌన్ కూడా అమలు చేయబడుతోంది. కాబట్టి అర్చకస్వాములు భౌతికదూరాన్ని పాటిస్తూ ఏకాంతంగా ఈ ఊయల సేవను అర్చకులు, వేదపండితులు ఏకాంతంగా నిర్వహించారు.