రాచకొండ : వనస్థలీపురం పోలీసు స్టేషన్ పరిధిలో పాత నేరస్తుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్ (25) అనే వ్యక్తి నుంచి 16 మోటర్ సైకిళ్ళు రికవరీ చేసారు.వీటి విలువ సుమారు 9 లక్షల రూపాయలు ఉంటుందని సి.పి. తెలిపారు. గతంలో ఇతని పై వనస్దలీపురం పోలీసు స్టేషన్ లో11 కేసు లు నమోదు అయ్యాయి.సైఫాబాద్, చిలకలగూడ పి.ఎస్. పరిధులలో కేసులు ఉన్నాయని సి.పి. చెప్పారు . హుజుర్ నగర్ లో ఓ కంపెనీ లో నిందితుడు పని చేస్తున్నాడు .సీసీ కెమరా ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు . ప్రతి కాలనీలో సిసి కెమరాలు ఏర్పాటుచేస్తే బాగుంటుందని సి.పి .అన్నారు.
పహడిషరిఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో అక్తర్ ఆలీ, నవ్శాద్ ఆవులను దొంగతనం చేసి ఇతరులు ముగ్గురికి విక్రయిస్తున్న సమయంలో పట్టుకున్నామని పోలీసులు తెలిపారు . ఇప్పటి వరకు 8 కేసులలో నిందితులుగా ఉన్నారని సి.పి. తెలిపారు. రైతులు పశువులను కట్టేసి పోతున్నారు, దొంగలు వచ్చి వాటిని తరలించి బయట అమ్ముకుంటున్నారన్నారు . సిసి కెమరాలు పెడితే దొంగలను త్వరగా పట్టుకోవచ్చని సి.పి .అన్నారు.