తాడేపల్లి : ప్రజారోగ్య రంగంలో ప్రధానంగా అత్యవసర సేవలందించే 108 అంబులెన్స్ డ్రైవర్లకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త చెప్పారు. డ్రైవర్లకు జీతాలను భారీగా పెంచారు. డ్రైవర్ల సర్వీసుకు అనుగుణంగా రూ.18 నుంచి 28 వేల వరకు జీతాలు పెంచుతున్నట్లు ప్రకటించారు. బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రిలో నాట్కో కేన్సర్ బ్లాక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ 108 సిబ్బంది జీతాలు పెంపు విషయాన్ని వెల్లడించారు.