పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానంలో ఘనంగా శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం
శ్రీశైలం: శ్రీశైల దేవస్థానంలో లోకకల్యాణం కోసం పౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానం ఈ రోజు (09.03.2020) రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించారు.
ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి మరియు మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) జరిపించబడుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపించారు.
అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్తోక్తంగా షోడశోపచారపూజలు జరిపించారు. తరువాత శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం నిర్వహించారు.
ఈ ఉత్సవములో శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేసే పల్లకి వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. కాగా ఈ పల్లకీ ఉత్సవ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనేందుకు దేవస్థానం అవకాశాన్ని కల్పించారు.