పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీశైలదేవస్థానంలో శ్రీశైల గిరి ప్రదక్షిణ
శ్రీశైలం: పౌర్ణమిని పురస్కరించుకొని దేవస్థానం ఈ రోజు సాయంత్రం (09.03.2020) శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమం సాంప్రదాయబద్ధంగా నిర్వహిచింది.
ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్ల మహామంగళహారతుల అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో వేంచేబు చేయించి ప్రత్యేకపూజలు జరిపించారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్ల పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరిప్రదక్షిణ ప్రారంభమయింది.
ఆలయ మహాద్వారం నుండి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధరమండపం, అంకాళమ్మ ఆలయం, నందిమండపం, గంగాసదనం, బయలువీరభద్రస్వామి ఆలయం, వలయ రహదారి మీదుగా ఫిల్టర్ బెడ్, సిద్దిరామప్పకొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంటుంది. అక్కడి నుండి తిరిగి నందిమండపం వద్దకు చేరుకుంది. నందిమండపం నుండి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకోవడంతో ఈ గిరిప్రదక్షిణ ముగీసింది.
కాగా శ్రీశైలగిరిప్రదక్షిణ ఎంతో ప్రాశస్త్యం ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి. త్రేతాయుగములో శ్రీరాముడు శ్రీశైల ద్వార క్షేత్రాల గుండా గిరిప్రదక్షిణ ఆచరించినట్లు శ్రీశైలఖండం చెబుతోంది.
శ్రీశైలక్షేత్రములోని ప్రాచీన .మఠాలను, ఆలయాలను భక్తులచేత దర్శింపజేయిస్తూ వారిలో భక్తిభావాలను మరింతగా పెంపొందింపజేయాలని, అదేవిధంగా క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా తీర్చిదిద్దడంలో భాగంగా ఈ గిరిప్రదక్షిణను నిర్వహించడం జరుగుతోంది.
ఈ గిరిప్రదక్షిణకు మార్గమధ్యములో భక్తులకు అవసరమయ్యే మంచినీటి సౌకర్యాన్ని కూడా దేవస్థానం కల్పించింది.
గిరిప్రదక్షిణ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేసారు.