హైదరాబాద్ లో ఆఫ్రికా ఖండం జర్నలిస్టుల బృందం

ఆఫ్రికా ఖండం లోని వివిధ దేశాలకు చెందిన 28 మంది జర్నలిస్టుల బృందం గురువారం హైదరాబాద్ కు చేరుకుంది. భారత దేశ పర్యటనలో భాగంగా విదేశి వ్యవహారాల శాఖ, ఎక్స్ టర్నల్ పబ్లిసిటీ డివిజన్ అండర్ సెక్రటరీ  ఫకృద్దీన్ అలీ అహ్మద్ఆధ్వర్యంలో ఈ బృందం హైదరాబాద్ లో ఈ నెల 24 వరకు పర్యటించనుంది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం (గురువారం) చారిత్రాత్మకమైన చార్మినార్ ను సందర్శించింది. ఆ కట్టడo విశేషాలను సంబంధిత శాఖాధికారులు వారికి వివరించారు.  ఈ కార్యక్రమంలో సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్  అర్వింద్ కుమార్  ఆదేశాల మేరకు అదనపు సంచాలకులు  నాగయ్య కాoబ్లే, జాయింట్ డైరెక్టర్ డి.ఎస్. జగన్ , డిప్యూటి డైరెక్టర్  డి.శ్రీనివాస్ , ఆసిస్టెంట్ డైరెక్టర్ లు  రాజా రెడ్డి,  బిమల్ దేవ్ తదితరులు ఈ బృందం వెంట ఉన్నారు.

ఈ జర్నలిస్టుల బృందం ఈ నెల 22వ తేది శుక్రవారం  గచ్చిబౌలి లోని టి-హబ్, రాజ్ భవన్ లోని సోలార్ పవర్ యునిట్ లను, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ను, 23 వ తేదిన బాలానగర్ లోని నేషనల్ ఇన్ స్టిస్ట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్,  రీసెర్చ్ సెంటర్ ను, శామీర్ పేటలోని జినోమ్ వ్యాలీని, లింగంపల్లిలోని బి.హెచ్.ఇ.ఎల్ ను , గోల్కొండ ఫోర్ట్ ను దర్శించి 24 వ తేదిన ఉదయం ఆఫ్రికా దేశాలకు బయలుదేరి వెళుతుంది.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.