శ్రీశైల దేవస్థానం:ఈ రోజు (19.01.2021)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ.3,82,23,900 /- లు నగదు రాబడిగా లభించింది.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 35 రోజులలో సమర్పించారు.
పై నగదుతో పాటు 153 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారు, 4 కేజీల 700 గ్రాముల వెండి లభించాయి. అలాగే 200 ఎస్ ఏ
డాలర్లు, 155 యు ఎ ఇ దిర్హమ్స్, 15 యూరోస్, 05 కెనడా డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి.
పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును చేపట్టారు.
దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది మరియు శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.