సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ సలీముద్దీన్ ఆకస్మిక మృతి పట్ల సంతాపం

*సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ సలీముద్దీన్ మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు

తెలంగాణ సీనియర్ జర్నలిస్ట్ మహమ్మద్ సలీముద్దీన్ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర  మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సంతాపం తెలిపారు. ఆయన  కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీడియా అకాడమీ తరఫున సలీముద్దీన్ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు.   

 నల్లగొండలో పుట్టిన సలీముద్దీన్ జర్నలిజం వృత్తిలో ప్రవేశించి సీనియర్ జర్నలిస్టుగా రాణించారని అన్నారు.  ఆంధ్ర ప్రభ, సూర్య దినపత్రికలో పనిచేసిన అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రిక ప్రారంభం నుండి ఇప్పటి వరకు వివిధ హోదాలలో పనిచేశారని తెలిపారు. ఆయన అర్దాంతరంగా వెళ్లిపోవడం బాధాకరమని అన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.