
శ్రీశైలం దేవస్థానం దేశ రాజధానిలో హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆదివారం ఉదయం సామూహిక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. అన్నాభిషేకం , సామూహిక కుంకుమార్చనలు కూడా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం ఇ.ఒ. ఎ.శ్రీరామచంద్ర మూర్తి, ఇతర అధికారులు , పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఆదివారం అనేక మంది భక్తులు శ్రీశైలం సందర్శించారు. పాతాళగంగలో పుణ్య స్నానాలు ఆచరించారు.కళారాధనలో ఆదివారం లిక్షితాశ్రీ కూచిపూడి నృత్య కళాశాల వారు నృత్య ప్రదర్శన సమర్పించారు.
*G. Thippeswami, MLC, Chairman, committee On Welfare Of B.C. A.P Legislative Assembly visited the temple. authorities received with temple maryadha .