
కర్నూలు: శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ నెల 11న శివరాత్రి వేడుకలను, రాత్రి పాగాలంకారణను, శివపార్వతుల కల్యాణాన్ని సంప్రదాయబద్దంగా, ఘనంగా నిర్వహించడానికి శ్రీశైలం దేవస్థానం, జిల్లా యంత్రాంగం తరఫున ఆన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తీ చేశామని జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్ తెలిపారు.శ్రీశైలం లో సామాన్య భక్తులకు, శివమాల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా..గత ఏడాది శివరాత్రి నాడు విజయవంతంగా ఏర్పాట్లు చేసిన తరహాలోనే ఈ సారి కూడా దర్శనం ఏర్పాట్లు చేశామన్నారు.
మునిసిపల్ ఎన్నికలు ఉన్నా కూడా తాను, ఎస్పీ సంయుక్తంగా జిల్లా అధికారులతో కర్నూలు లో ఒకసారి, శ్రీశైలం లో మరోసారి కర్నూలు , ప్రకాశం జిల్లా అధికారులు, తెలంగాణా సరిహద్దు ప్రాంతం అచ్చంపేట అధికారులతో రెండు సార్లు సమీక్షా సమావేశాలను నిర్వహించి అన్ని శాఖల అధికారులకు విధులను అప్పజెప్పామని కలెక్టర్ వివరించారు. బుధవారం మునిసిపల్ ఎన్నికల పోలింగ్ అయిన వెంటనే పలు శాఖల జిల్లా అధికారులను శ్రీశైలం పంపాము..ఎస్పీ బుధవారం సాయంత్రం శ్రీశైలం వెళ్లారు..తాను కూడా మునిసిపల్ ఎన్నికల బ్యాలెట్ బాక్స్ లు, పోలింగ్ సామగ్రిని స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టించి, సీల్ చేసిన తీరును బుధవారం రాత్రికి తనిఖీ చేసి, గురువారం తెల్లవారుజామున శ్రీశైలం బయలుదేరి వెళుతున్నామని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు.
శ్రీశైలం భక్తులకు నీడ, త్రాగునీరు, తాత్కాలిక వసతి, అన్నప్రసాదం, లడ్డూ ప్రసాదాలు, శీఘ్ర దర్శనం, మెడికల్ క్యాంపు లు, కోవిడ్ నిబంధనల జాగ్రత్తలు, పాతాళ గంగ స్నానాల కోసం షవర్స్ ఏర్పాటు, అదనపు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు, పార్కింగ్, కంట్రోల్ రూమ్, భక్తిని పెంపొందించే ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తులకు క్యూ లైన్ లు, శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తదితర అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తీ చేసి, దేవస్థానం అధికారులతో పాటు జిల్లా సీనియర్ అధికారులకు విధులు కేటాయించాము..అధికారులు అందరూ వారి..వారి విధుల్లో, భక్తుల సేవలో నిమగ్నమయ్యారన్నారు.
దేవస్థానం అధికారులు, జిల్లా అధికారులు, పోలీసు అధికారులు చెప్పే సూచనలను శ్రీశైలం భక్తులు పాటించి శ్రీ మల్లిఖార్జున స్వామి వారు, శ్రీ భ్రమరాంబిక అమ్మవారి దర్శనాలు బాగా చేసుకుని స్వామి, అమ్మవారి ఆశీర్వాదాలు పొంది, శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడానికి సహకరించాలని విజ్ఞప్తి చేసారు.
శ్రీశైల దేవస్థానం: ఈ రోజు (10.03.2021) న శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. యాగశాలలో శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిగాయి. అనంతరం లోక కల్యాణం కోసం జపాలు, పారాయణలు చేసారు.అనంతరం మండపారాధనలు, పంచావరణార్చనలు, శివపంచాక్షరి, నిత్యహవనాలు, రుద్రహోమం, చండీహోమం, కార్యక్రమాలు ఆగమ శాస్త్రం ప్రకారంగా చేసారు. ఈ సాయంకాలం ప్రదోష కాల పూజలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, హోమాలు చేసారు.
| గజవాహన సేవ:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు (10.03.2021) రాత్రి శ్రీస్వామి అమ్మవార్లకు గజవాహనసేవ మనోహరంగా జరిగింది.ఈ సేవలో శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను అక్కమహాదేవి అలంకార మండపంలో గజవాహనంపై వేంచేబు చేయించి ప్రత్యేక పూజాదికాలు చేసారు. తరువాత శ్రీశైలక్షేత్ర ప్రధాన వీధులలో గ్రామోత్సవంప్రత్యేక ఆకర్షణ.కోలాటం, చెక్కభజన, రాజబటులవేషాలు, జాంజ్ పథక్, జానపద పగటి వేషాలు, గొరవనృత్యం, బుట్టబొమ్మలు, తప్పెటచిందు బీరప్పడోలు, చెంచునృత్యం, నందికోలసేవ, డమరుకం, చితడలు, శంఖం, పిల్లన్నగ్రోవి తదితర కళారూపాలు గ్రామోత్సవంలో ప్రత్యేకం.
*His Holiness Sri Sri Sri Chenna Siddha Rama Siva Charya Mahaswamy Varu, Srisaila Jagadguru Peetham visits to the Great temple. E.O. and others received with temple maryaadha.
* P.Arjuna Rao,IAS, Special Commissioner, Endowments Department visited temple. E.O. and others received with temple maryaadha.
*Gayopakhyanam Programme At Sivadeekha Sibiralu Stage, Bharathanatyam Programme at Kalaradahana stage, Kuchipudi Programme at Pushkarini Stage and other cultural programmes attracted the devotees.
*చక్కని సౌకర్యాల మధ్య శ్రీశైల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.
*His Holiness Sri Sri Sri Chenna Siddha Rama Siva Charya Mahaswamy Varu, Srisaila Jagadguru Peetham visits to the Great temple. E.O. and others received with temple maryaadha.