
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగం వేగం. కాగా ఈ రోజు (02.03.2021)న జరిగిన హుండీల లెక్కింపు ద్వారా శ్రీశైల దేవస్థానానికి రూ. 4,58,76,546/-లు నగదు రాబడిగా లభించింది.
ఈ హుండీ ఆదాయాన్ని భక్తులు గత 42 రోజులలో సమర్పించారు. ఈ నగదుతో పాటు 266 గ్రాముల బంగారు, 6 కేజీల 240 గ్రాముల వెండి లభించాయి. 237 యు.ఎస్.ఏ. డాలర్లు, 105 కత్తార్ రియాల్స్, 530 యూఏఈ దిర్హమ్, 60 యూరోస్, 50 సింగపూర్ డాలర్లు మొదలైన విదేశీ కరెన్సీ కూడా హుండీల లెక్కింపులో లభించాయి. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య సీసీ కెమెరాల నిఘాతో ఈ లెక్కింపును నిర్వహించారు.దేవస్థాన అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, శివసేవకులు ఈ హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.
- Kumaaraswaamy puuja, Bayalu veerabhadra swaamy puuja, Nandheeswara Puuja performed in the temple .