శ్రీశైల దేవస్థానం:భక్తులసౌకర్యార్థం దేవస్థానం ప్రతిరోజు భక్తులకు అన్నప్రసాదాలను ఉచితంగా అందజేస్తోంది. ఉదయం 7.30గంటల నుండి మధ్యాహ్నం 3.30గంటల వరకు కూడా అమ్మవారి ఆలయ వెనుకభాగములో ఈ వితరణ నిర్వహిస్తున్నారు. సాంబారన్నం, చిత్రాన్నం,మొదలైన అన్నప్రసాదాలు భక్తులకు ఉచితంగా అందిస్తున్నారు. వీటితో పాటు మంచినీటిపాకెట్లను కూడా భక్తులకు ఇస్తున్నారు.అదేవిధంగా భక్తుల కోరిక మేరకు పులిహోర, పెరగన్న విక్రయ ప్రసాదాలను కూడా అందుబాటులో ఉంచారు.
150 గ్రాముల పులిహోర ప్రసాదాన్ని భక్తులు రూ.10/-లకు కొనుగోలు చేయవచ్చు. 150 గ్రాముల పెరుగన్న ప్రసాదాన్ని కూడా రూ. 10/-లకు కొనుగోలు చేయవచ్చు.