శ్రీశైల గిరిజన చెంచు భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాల బహూకరణ శనివారం ప్రత్యేక కార్యక్రమంలో జరిపారు. తరతరాలుగా గిరిజన చెంచులకు , శ్రీశైల క్షేత్రానికి గల గాఢ సంబంధం దృశ్యా ఈ దసరా వేడుకల్లో ఈ కార్యక్రమం చేపట్టామని ఈ ఓ కే ఎస్ రామా రావు చెప్పారు. ఈ కార్యక్రమాలను మరింత విస్తృతం చేస్తామన్నారు. ఈ దసరా వేడుకల్లో వారి సంప్రదాయ నృత్య కార్యక్రమం కూడా జరిగిందని తెలిపారు.