
* Principal District Judge Dr. Krupa Sagar , Kurnool visited Srisaila temple on 19th February 2021.E.O. received with temple maryaadha.
*Ankalamma Vishesha Puuja,Uuyala Seva performed in the temple by Archaka swaamulu.
*Rathasapthami events, Suryaaraadhana in the temple performed with great enthusiasm
* శ్రీశైల దేవస్థానం:రథసప్తమి పర్వదినం సందర్భంగా ఈరోజు (19.02.2021) న ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకారమండపం వద్ద సూర్యరాధన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముందుగా, దేశం శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడిపంటలతో తులతూగాలని, జనులందరికి ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు జరగకుండా ఉండాలనీ, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, అన్ని సామాజిక వర్గాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలంటూ ఆలయ అర్చకులు, వేదపండితులు లోక కల్యాణ సంకల్పాన్ని చెప్పారు.తరువాత కలశస్థాపన చేసి కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.
అనంతరం వైదికాచార్యులు ఆయా బీజమంత్రాలతోనూ, ప్రత్యేక ముద్రలతోనూ సూర్యనమస్కారాలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగానే సూర్యయంత్రపూజ, చతుర్వేదపారాయణలు, అరుణ పారాయణలు జరిగాయి . అనంతరం మధ్యాహ్నం గం. 12.00లకు సూర్యభగవానుడికి విశేషంగా షోడశోపచార పూజ చేసారు.
మన పురాణాలలో ఈ సూర్యారాధన గురించి ఎంతో విశేషంగా చెప్పారు. సూర్యారాధన వల్ల అనారోగ్యం తొలగి ఆరోగ్యం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రథసప్తమి రోజున సూర్యుని ఆరాధించడం ఎంతో ఫలదాయకం.
మన్వంతర ప్రారంభంలో సూర్యభగవానుడు మాఘశుద్ధ సప్తమి రోజున మొట్టమొదటిసారిగా తన ప్రకాశాన్ని లోకాలకు అందించాడని చెబుతారు. అందుకే సూర్యుడు జన్మించిన రథసప్తమి రోజును సూర్యజయంతిగా జరుపుకోవడం ఆచారంగా కొనసాగుతోంది. వివిధ కార్యక్రమాల్లో ఈ ఓ ఇతర అధికార , సిబ్బంది పాల్గొన్నారు. అర్చక స్వాములు ఆలయ సంప్రదాయాల ప్రకారం వివిధ పూజ కార్యక్రమాలు నిర్వహించారు.