శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు రాత్రి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి పల్లకీ ఉత్సవం జరిపించింది.
ఈ పల్లకీ ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో (సర్కారి సేవగా) నిర్వహిస్తారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని, తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతిపూజ జరిపారు.అనంతరం శ్రీ స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు జరిపారు. తరువాత శ్రీ స్వామిఅమ్మవార్లను పల్లకీలో వేంచేబు చేయించి పల్లకీ ఉత్సవం నిర్వహించారు.ఈ ఉత్సవములో శ్రీస్వామిఅమ్మవార్లను వేంచేబు చేసే పల్లకిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.