దివ్యదర్శనం కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఈపూర్ బృందం శనివారం శ్రీశైలం క్షేత్ర సందర్శన చేసింది . ఆలయ రాజగోపురం వద్ద ఈ బృందానికి అధికారులు , అర్చక స్వాములు స్వాగతం పలికారు . అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు . భక్తులకు వేద ఆశీర్వచనం చేసారు . భక్తులకు ప్రసాదం అందించారు . ఈ బృందానికి ఇతర సదుపాయాలు కూడా కల్పించారు .