శృంగేరి ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ విదుశేఖర భారతీ స్వామి వారు బుధవారం ఉదయం శ్రీశైలం స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు . ఆలయ రాజగోపురం వద్ద అధికారులు , వేదపండితులు , అర్చకస్వాములు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు . శ్రీ స్వామి వారికి అభిషేకాది అర్చనలు , అమ్మవారికి అర్చనాదులు శృంగేరి స్వామి స్వయంగా నిర్వహించారు . అనంతరం వేదగోష్ఠి జరిపారు .శ్రీ స్వామి వారికి వస్త్ర సమర్పణ , శ్రీ స్వామి అమ్మవార్ల జ్ఞాపికను అందించారు .చాలా కాలంగా శృంగేరి కి శ్రీశైలానికి మధురమైన బంధం ఉందని ఉత్తరాధికారి పేర్కొన్నారు . శృంగేరి ఈ దేవస్థానానికి సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు . శ్రీశైల శ్రీ స్వామి అమ్మవార్ల కటాక్షంతో ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు . ఇక్కడ అందరికి మంచి శ్రేయస్సు కలగాలన్నారు .