శ్రీశైలంలో 27 న ఘనంగా అక్షరాభ్యాసాలు జరిగాయి . దేవస్థానం వారు మంచి ఏర్పాట్లు చేసారు .అక్షరదీవెన పేరున ఈ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది .240 మంది బాలబాలికలకు అక్షరాభ్యాసాలు జరిగాయి . శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కల్యాణ మండపంలో ఉదయం 10.30 నుంచి పండితులు , అర్చక స్వాములు కార్యక్రమం జరిపించారు . రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సూచనల మేరకు ఘనంగా జరిపారు .జగద్గురు శ్రీ శ్రీ శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి అనుగ్రహ భాషణం చేసారు .దేవస్థానం ఈఓ శ్రీరామచంద్ర మూర్తి బాలబాలికలకు దీవెనలు అందించారు . ఈ రోజు సరస్వతీదేవికి విశేష పూజలు జరిపారు . ఈ రోజు సాక్షి గణపతి ఆలయంలో నిత్య గణపతి హోమం ప్రారంభించారు .ఆలయ ప్రాంగణంలో గో సేవ కార్యక్రమం ప్రారంభించారు .