శ్రీశైలం దేవస్థానం పరిధిలో గణతంత్ర వేడుకల సందర్బంగా ఈ నెల 20 నుంచి జరిగిన క్రికెట్ పోటీల విజేతలకు ఈరోజు బహుమతులను దేవస్థానం ఈఓ భరత్ అందించారు . మొత్తం 32 టీములు పాల్గొనగా ఇంజినీరింగ్ విభాగం టీం , నాయక్ టీం విజేతలయ్యారు . ఇంగినీరింగ్ విభాగం టీం కెప్టెన్ రాజేష్ , సభ్యులు ఈఓ నుంచి ట్రోఫీని అందుకున్నారు.నాయక్ టీం కెప్టెన్ మల్లికార్జున , టీం సబ్యులు ట్రోఫీని అందుకున్నారు . రన్నర్స్ టీంలకు కూడా ట్రోఫీ లను అందించారు ,బెస్ట్ బ్యాట్స్మెన్గా హనుమంతు నాయక్, శ్రీనివాస్ లు ట్రోఫీలు అందుక్న్నారు . బెస్ట్ బౌలర్స్గా గోరక్ నాయక్, శేషయ్య లు ట్రోఫీలు అందుకున్నారు , పలువురు అధికారులు , పీ ఆర్ ఓ పాల్గొన్నారు .