శ్రీశైలంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమం జరిగింది . ఇందులో భాగంగా అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రుద్రవనంలోని ధ్యానమందిరంలో ఈ కార్యక్రమం మూడు రోజులు ఉంటుంది. శ్రీ రవిశంకర్ శ్రీశైలం పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమం జరగుతోంది. రవిశంకర్ శిష్యులలో ఒకరు విష్ణుపాద నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి 200 మంది ఇందులో పాల్గొంటున్నారని కోఆర్డినేటర్ త్రివేది తెలిపారు. పరమేశ్వర గౌడ్ , లింగన్న గౌడ్, సుమంత్, శ్రీనివాస రావు , అశోక్ తదితరులు పాల్గొననున్నారు.