వేగంగా పోషణ్ అభియాన్ కార్యక్రమాలు

పోషణ్ అభియాన్ లో భాగంగా 31 జిల్లాల్లో  డా. బి.ఆర్.అంబేత్కర్ జయంతి నుంచి  24 ణ  జాతీయ పంచాయితీ రాజ్ దివస్ వరకు ప్రజల భాగస్వామ్యం కోసం  ప్రతి గ్రామం లో 14 న గ్రామ సభ నిర్వహిస్తారు .గ్రామాల్లో  పిల్లలు,  తల్లుల పోషణ స్థాయి పెంచడానికి  రానున్న మూడు   సంవత్సరాలలో లక్ష్యాలను నిశ్చయించి , అమలు కోసం పంచాయితీ రాజ్, ఆరోగ్య, పారిశుధ్య శాఖల సమన్వయంతో   ఈ కార్యక్రామాన్ని చేపడుతారు .

పోషణ అభియాన్ ను  ప్రధానమంత్రి మార్చి 8, 2018 న ప్రారంచారు . ఈ మిషన్ క్రింద మొదటి విడతగా తెలంగాణా లో 10 జిల్లాలలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, మహబూబ్నగర్, గద్వాల్ , వనపర్తి, నాగర్ కర్నూల్, హైదరాబాద్,  రంగారెడ్డి (మొత్తం 48 ప్రాజెక్ట్ లు, 10960 అంగన్వాడి కేంద్రాలలో) ప్రారంభించారు .

శుక్రవారం సచివాలయంలో జరిగిన ఈ సమీక్షా సమావేశానికి ఉమన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ విజయిందర్ బోయి తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోషణ అభియాన్ కార్యక్రమం కోసం  ప్రతి గ్రామంలో గ్రామ సభలు జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.