లక్ష కోట్ల రాజధాని వద్దు..సాగునీటి ప్రాజెక్టులే ముద్దు – ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి

లక్ష కోట్ల రాజధాని వద్దు..సాగునీటి ప్రాజెక్టులే ముద్దని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పేర్కొన్నారు.  ప్రతిపక్ష నేత చంద్రబాబు రాయలసీమ ద్రోహి అని ఆయన విమర్శించారు.సీమ ప్రాజెక్టులను చంద్రబాబు నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు అమరావతి ఓ భ్రమరావతి..గ్రాఫిక్స్‌తో ఐదేళ్లు చంద్రబాబు కాలయాపన చేశారని విమర్శించారు. రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు చంద్రబాబు ఎందుకు జోలె పట్టలేదని ప్రశ్నించారు. లక్షల మంది వలసలు వెళ్లినప్పుడు బాబు జోలె ఎందుకు పట్టలేదని నిలదీశారు.  13 జిల్లాల అభివృద్ధి చంద్రబాబుకు అవసరం లేదా అని ప్రశ్నించారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.