ప్రిన్సిపల్ సెక్రటరీ, వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ అధికారులతో ఈ రోజు జరిగిన రైతుబంధు పథకం క్రింద చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్ష చేశారు. ఈ రోజు రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో నిర్ణీత షెడ్యూల్ ప్రకారం చెక్కులు, పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ సజావుగా జరిగింది. ఎండ తీవ్రత దృష్ట్యా కౌంటర్ల వద్ద త్రాగునీరు మరియు First Aid Boxes ఏర్పాటు చేసారు . ఈ రోజు 1372 గ్రామాలలో 4.48 లక్షల చెక్కులను పంపిణీ చేయగా ఈ రోజు సాయంత్రం వరకు 227 కోట్ల రూపాయలను నగదు చేసుకున్నారు.
తహశీల్దారు ధృవీకరించిన, పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ జాబితాలను (Lists) బ్యాంకులకు అందజేయవలసినదిగా సూచించారు.
రైతులు తమతోపాటు ఈ క్రింద తెలిపిన ఏదైనా ఒక ఫోటో గుర్తింపు కార్డును తమతో తీసుకు వెళ్ళాలని సూచించారు.
ఆధార్ కార్డు, ఒటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు
జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద జారీ చేసిన కార్డు
డ్రైవింగ్ లైసెన్స్, పాసు పోర్టు