×

రుద్రాక్షమటం వద్ద పురాతన వస్తువులు లభ్యం

రుద్రాక్షమటం వద్ద పురాతన వస్తువులు లభ్యం

శ్రీశైలం దేవస్థానం పరిధిలోని రుద్రాక్షమటం  వద్ద బుధవారం తవ్వకాల్లో పురాతన వస్తువులు లభ్యమయ్యాయి . మటం పునర్నిర్మాణం  పనుల్లో భాగంగా ఈ రోజు రాళ్ళను తొలగిస్తుండగా పురాతనమైన మూడు రాగి పాత్రలు బయటపడ్డాయి . పూజాది కార్యక్రమాల్లో వినియోగించే  పాత్రలను ఈ రాగి పాత్రలు పోలిఉన్నాయి . విషయం తెలియగానే దేవస్థానం యంత్రాంగం తో పాటు స్థానిక పోలీస్ అధికారులు చేరుకున్నారు . వాటిని దేవస్థానం పరిపాలన భవనానికి చేర్చారు . గత జనవరి 31 వ తేదీన కుడా తవ్వకాల్ల్లో రాగి , ఇత్తడి , ఇనుము వస్తువులు దొరికిన సంగతి తెలిసిందే. ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా ఈ పనులు సాగుతున్నాయి .

print

Post Comment

You May Have Missed