స్థానిక పండ్ల మార్కెట్ హోల్ సేల్ వ్యాపారుల షాపులపై బుధవారం ఉదయం విజిలెన్సు దాడులు జరిగాయి . కొన్ని చోట్ల రసాయనాల ద్వారా మామిడి పండ్లను మగ్గిస్తున్నట్టు గుర్తించారు . విజిలెన్స్ ఎస్.పీ రవీంద్ర బాబు ఆధ్వర్యంలో ఫుడ్ ఇన్స్పెక్టర్ శేఖర్ రెడ్డి , ఫుడ్ ఇన్స్పెక్టర్ అపర్ణ దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసారు . రెండు దుకాణాలపై కేసులు నమోదు అయ్యాయి . దాదాపు రూ. 5 లక్షల విలువైన పండ్లను దాడుల్లో గుర్తించారు .