యాదాద్రిలో శనివారం రాత్రి అమ్మవారు శ్రీ స్వామి వారి కల్యాణం రమణీయంగా జరిగింది. వేలాది భక్తులు కళ్యాణోత్సవానికి హాజరయ్యారు . రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు . అర్చక స్వాములు శాస్త్రోక్తంగా , కన్నులవిందుగా కల్యాణోత్సవం నిర్వహించారు . ఈఓ గీత ఆధ్వర్యంలో దేవస్థానం వారు చక్కని ఏర్పాట్లు చేసారు .