ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం పాటించాలి -సుచరిత

గుంటూరు: పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హోం మంత్రి మేకతోటి సుచరిత ఆదేశించారు.పరిధి చూడకుండా జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుదారులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించకూడదని సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానంతో వ్యవహరించాలని తెలిపారు. పోలీస్‌ స్టేషన్ల వద్ద ఫిర్యాదుల పెట్టెను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. మహిళా పీఎస్‌లలో మహిళా అధికారులను నియమిస్తామని వెల్లడించారు.

print

Post Comment

You May Have Missed