తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం, ప్రపంచ ప్రఖ్యాత హైదరాబాద్ లో ప్రపంచ తెలుగు మహాసభలు శుక్రవారం ప్రారంభమవుతున్నాయి. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యవేక్షణలో రాష్ట్ర అధికార యంత్రాంగం ఇందుకు సర్వం సిద్ధం చేసింది. అన్ని ఏర్పాట్లతో ప్రభుత్వం” కార్యక్రమ కరదీపిక ” ను వెలువరించింది. ప్రతినిధులకు ” తెలంగాణ వైభవం పరిచయ దీపిక ” ను అందించింది. వివిధ వేదికలను సిద్ధం చేసింది. 15 వ తేదీన ప్రారంభమై 19 వ తేదీన సభలు ముగుస్తాయి . శుక్రవారం సాయంత్రం 5 గంటలకు లాల్ బహుదూర్ స్టేడియం లో పాల్కురికి సోమన ప్రాంగణం , బమ్మెర పోతన వేదికపై సభలు ప్రారంభమవుతాయి. ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు రానున్నారు. విశిష్ట అతిథులుగా గవర్నర్ నరసింహన్ , మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యా సాగర్ రావు అలంకరించనున్నారు. నగరంలో పోలీసులు తగిన వ్యవస్థను ప్లాన్ చేసారు.