ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గజ్వేల్ పర్యటన కోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయిఅని ఇరిగేషన్ శాఖా మంత్రి శ్రీ హరీష్ రావు తెలిపారు. గజ్వేల్ ప్రాంతంలో మిషన్ భగీరథ ఆరునెలల్లో పూర్తి కావడం ఆల్ టైమ్ రికార్డు అని తెలిపారు. దేశ ప్రధానమంత్రి మోడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి గజ్వేల్ కు రావడం ఇదే తొలిసారి. ప్రధానమంత్రి మోడీ ఈ నెల 7న మిషన్ భగీరథ మరియు ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేస్తారు.
ముఖ్యమంత్రి కెసిఆర్ 1998 లోనే లోయర్ మానేరు డ్యామ్ నుంచి సిద్దిపేట కు తాగునీటిని రప్పించి భగీరధుడి గా పేరు పొందారు. ఇప్పుడు గజ్వేల్ లోనూ దాన్ని రిపీట్ చేశారు. రేపు రాష్ట్రమంతటా ఈ పధకం ఫలితమివ్వనున్నది . ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి అని హరీష్ రావు తెలిపారు.
మోదీ గజ్వేల్ పర్యటన కోసం ఏర్పాట్లలో మంత్రి శ్రీ హరీష్ రావు తో పటు, రవాణా శాఖా మంత్రి శ్రీ పి. మహేందర్ రెడ్డి. ఎం.పి. శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.