ప్రధాని మోదీపై హత్య కుట్రను ఆరోపిస్తూ మహారాష్ట్ర పోలీసులు గతంలో చేసిన ప్రకటన పర్యవసానంగా సోదాల పేరుతో హైదరాబాద్ లో ప్రజా సంఘాల ప్రముఖులు వరవరరావుతో పాటు మరికొందరి ఇళ్లపై, జర్నలిస్టులు కుర్మానాథ్, టేకుల క్రాంతి ఇళ్లపై దాడులకు పూనుకోవడం, అక్రమ అరెస్టులకు పాల్పడడం విచారకరమని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం(టీయుడబ్ల్యుజె) అధ్యక్షులు నగునూరి శేఖర్, ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇది పౌర హక్కులకు, పత్రిక స్వేచ్ఛకు భంగం కలిగించే చర్యగా భావిస్తున్నామన్నారు..