శ్రీశైల దేవస్థానం:ప్రాచీన కట్టడాల పరిరక్షణలో భాగంగా దేవస్థానం చేపట్టిన ఘంటామఠ పునర్నిర్మాణ పనులను ఈ రోజు కార్యనిర్వహణాధికారి పరిశీలించారు.ప్రాచీన నిర్మాణశైలికి ఎలాంటి విఘాతం కలగకుండా ఈ పునర్నిర్మాణ పనులను చేపడుతున్నారు.ఇప్పటికే ఘంటామఠం ప్రాంగణములోని ప్రధానాలయపు గర్భాలయం, అంతరాలయం, ముఖమండపం, విమాన గోపుర పునర్నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి.ప్రస్తుతం ఉపాలయాల పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ పునర్నిర్మాణ పనులు త్వరలో పూర్తయ్యేందుకు వీలుగా వేగవంతంగా ఈ పనులను చేస్తున్నారు.
పునర్నిర్మాణ పనుల నిరంతర చిత్రీకరణకు వీలుగా సీసీ కెమెరాలు ఏర్పాటుచేసారు. అదేవిధంగా భద్రతా చర్యలలో భాగంగా రోజువారి విధులకుగాను మూడు షిప్టులలో కూడా ప్రత్యేకంగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసారు.ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ పునర్నిర్మాణపనులలో నాణ్యత పట్ల ప్రత్యేకశ్రద్ధ కనబర్చాలన్నారు. ఎట్టి పరిస్థితిలో కూడా నాణ్యతలో రాజీపడకూడదన్నారు.ముఖ్యంగా పునర్నిర్మాణం పూర్తిగా ప్రాచీన శైలికి అనుగుణంగానే ఉండాలన్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయిన వెంటనే చుట్టూ ప్రాకారం, పచ్చదనం ఏర్పాటుకు వీలుగా వెంటనే ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇంకా భక్తులందరు పంచమఠాలను ఒకేసారి దర్శించుకునేందుకు వీలుగా అన్నిమతాలను కలుపుతూ (ఒకే సర్కూట్ గా) ఏక రహదారిని నిర్మించేందుకు వీలుగా కూడా తగిన ప్రణాళికను సిద్ధం చేయాల్సిందిగా కూడా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విధుల నిర్వహణ సమయములో పూర్తి అప్రమత్తంగా ఉండాలని అక్కడి భద్రతా సిబ్బందిని ఆదేశించారు.
యాంఫీథియేటర్ పనుల పరిశీలన:
అభివృద్ధి పనుల పరిశీలనలో భాగంగా ఈరోజు కార్యనిర్వహణాధికారి యాంఫీథియేటర్ (ప్రదర్శనశాల) పనులను పరిశీలించారు.
భారత ప్రభుత్వపు “ప్రసాద్” (PRASAD – Pilgrimage Rejuvenation And Spiritual Augmentation Drive ) పథకం కింద గోశాల సమీపములో (వలయ రహదారి ప్రక్కలో) ఈ ప్రదర్శనశాల నిర్మితమవ్తోంది. ఇప్పటికే దాదాపు 80శాతానికి పైగా ఈ నిర్మాణపు పనులు పూర్తిఅయ్యాయి.
కార్యనిర్వహణాధికారి మాట్లాడుతూ యాంఫీ థియేటర్ ను వినియోగంలోకి తెచ్చేందుకు వీలుగా పునర్నిర్మాణ పనులను వీలైనంత త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. యాంఫీ థియేటర్ మరింత కళాత్మకంగా ఉండేందుకు చర్యలు చేపట్టడంతో పాటు ఆకర్షణీయమైన విద్ద్యుద్దీకరణ పనులు చేయాలని ఆదేశించారు.
ఈ పరిశీలనలో దేవస్థానం డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి తదితర ఇంజనీరింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రసాద్ పథకం కింద లైట్ అండ్ సౌండ్ షో, ఆలయంలో ఇత్తడి క్యూలైన్ల ఏర్పాట్లు, బస్టాండ్ సమీపంలో విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఏర్పాటు, వలయ రహదారి వద్ద పార్కింగ్ ప్రదేశ ఏర్పాటు, క్షేత్రంలో పలుచోట్ల శౌచాలయాల నిర్మాణం, కర్ణాటక ప్రభుత్వ అతిథిగృహం వద్ద టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ నిర్మాణం, శిఖరం వద్ద టూరిస్ట్ అమినిటీస్ సెంటర్ నిర్మాణం, శిఖరేశ్వరం వద్దనే వాటవర్ నిర్మాణం, శిఖరేశ్వర ఆలయం వద్దగల పురాతన పుష్కరిణి జీర్ణోద్ధరణ పనులు మొదలైనవి చేపట్టారు.
*Ankaalamma Special puja and Uyalaseva performed in the temple today.
* Trinay Krishna, Hyderabad donated Rs.One Lakh For Annadhaanam scheme in the temple.
*E.O. inspected the Goshaala today.