శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీశ్రీశ్రీ విదుశేఖర భారతీ స్వామి వారు మంగళవారం పాలధార పంచదార ను సందర్శించారు . శారదా చంద్రమౌళేశ్వర స్వామివారికి , ఆదిశంకరుల వారికి పూజాదికాలు నిర్వహించారు . వీరి వెంట వేద పండితులు , అర్చక స్వాములు ఉన్నారు . దేవస్థానం నూతనంగా చేపట్టిన శారదా చంద్రమౌళీశ్వర స్వామి , శంకర మందిర నిర్మాణ పనులను స్వామివారు పరిశీలించారు .