పవన్‌ అభిమానికి సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆర్థిక సాయం

తాడేపల్లి:  కులం, మ‌తం, ప్రాంతం, పార్టీలు చూడ‌మ‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప‌ద‌వీ ప్ర‌మాణ స్వీకారం చేసిన రోజే పేర్కొన్నారు.  జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌,  పవన్‌కల్యాణ్ అభిమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.10 లక్షలు మంజూరు చేశారు. పవన్ కల్యాణ్ అభిమాని నాగేంద్ర రక్త సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని, అతనికి అత్యవసర చికిత్స చేయాలంటూ ఓ స్వచ్ఛంద సంస్థ ట్వీట్ చేసింది. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఈ విషయాన్ని విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే సీఎం వైయ‌స్ జగన్ పవన్ అభిమానికి రూ.10లక్షలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో స్పెషల్ ఆఫీసర్‌ డాక్టర్ హరికృష్ణ ఆస్పత్రికి ఎల్‌వోసీ అందజేశారు. ప్రభుత్వ సాయంతో పవన్ అభిమాని నాగేంద్రకు స్టెమ్ సెల్ థెరపి జరిగింది. అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు సీఎంవో అధికారులు పేర్కొన్నారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.