నేర స్వభావం కొత్త రూపాలలోకి మారుతున్నదని, ఈ పరిస్థితులలో ఉగ్రవాదంపై పోరాటం జరపడానికి అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆధునిక ఆయుధాలను మోహరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. హైదరాబాద్ లోని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో జరిగిన ఐపిఎస్ ప్రొబేషనర్స్ 68వ బ్యాచ్ దీక్షాంత్ పరేడ్ (పాసింగ్ అవుట్ పరేడ్)కు హాజరై, వారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.