మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ మృతికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేసారు .అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన వేణుమాధవ్ మృతి కళారంగానికి తీరని లోటు , మిమిక్రీ కళను ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన మొట్ట మొదటి వ్యక్తి ,ఎంతోమంది మిమిక్రీ కళాకారులకు రోల్ మోడల్గా నిలిచారు , తన కళ ద్వారా కోట్లాది తెలుగువారికి వేణుమాధవ్ చేరువయ్యారని వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి తెలిపారు.