దేశ రాజధానిలో హిందూ ధర్మ ప్రచారం కార్యక్రమాన్ని శ్రీశైలం దేవస్థానం చేపట్టింది . సామూహిక అభిషేకాలు , సామూహిక కుంకుమార్చనలు శనివారం జరిగాయి . సాయంత్రం స్వామి అమ్మవార్ల కల్యాణోత్సవం నిర్వహించారు . భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు శనివారం శ్రీశైలం సందర్శించారు .ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. కాళారాధనలో కర్నూలు కు చెందిన రాజశేఖర గౌడ్ బృందం భజన సమర్పించారు .